కమాన్చౌరస్తా ఏప్రిల్ 21: పవిత్రమైన రంజాన్ను పురస్కరించుకొని నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో అధ్యాత్మిక చింతనలో గడిపిన ముస్లింలు శనివారం ‘ఈద్-ఉల్-ఫితర్’ను భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకొనేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈద్గాల వద్ద సౌకర్యాలు కల్పించారు. సమున్నత జీవన విధానానికి ప్రతీకగా, పరస్ప ర ప్రేమ, శాంతి, సహనాన్ని ప్రబోధించిన ఈ పర్వదినానా ముస్లింలు ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. మార్చి 22న ప్రారంభమైన రంజాన్ మాసం శుక్రవారంతో ముగిసిం ది. ఈద్-ఉల్-ఫితర్ నాడు నిరుపేదలకు విస్మరించకూడదనే తాఖీదును అనుసరించి ప్రతి ముస్లిం తనకు తోచిన మేరకు ఫిత్రా(దానం) ఇస్తారు. ఈ నెల చివరి ఉపవాసం రోజు నెలవంక చూశాక ఈద్ నమాజ్కు వెళ్లే ముందు ఫి త్రా చెల్లిస్తారు. నిర్భాగ్యులు సైతం పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవాలనేది సారంశం అందు లో ఉంది.
ఈద్గాలవద్ద సౌకర్యాలు..
జిల్లా కేంద్రంలో పురానీ ఈద్గాతోపాటు సాలేహ్నగర్, చింతకుంట, బైపాస్ రోడ్డు ఈ ద్గా, మండల కేంద్రాల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించనున్నారు. అలాగే రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని మసీదుల్లో అన్ని సౌ కర్యాలు కల్పించారు. అగ్నిమాపక సిబ్బం ది, ఫైర్ ఇంజిన్లను అందుబాటులో ఉంచారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.