తిమ్మాపూర్ రూరల్, మార్చి 11: తమ సమస్యలు పరిషరించాలని పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పంచాయతీ కార్మిక సంఘం మండల నాయకులతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను కలిసేందుకు క్యాంప్ కార్యాలయానికి రాగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలో సిబ్బందికి వినతి పత్రం అందజేశారు.
పెండింగ్లో ఉన్న జీతాలు తక్షణమే చెల్లించాలని, ఉద్యోగాలను పర్మినెంట్ చేసి వేతనాలను పెంచాలని, మల్టీపర్పస్ వరర్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల సంఘం మండలాధ్యక్షుడు బుడిగి అంజయ్య, నాయకులు, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.