చందుర్తి, జనవరి 26: దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు. మండలంలోని మల్యాలలో రూ. 36 లక్షలతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్మిస్తున్న రాజ గోపురం నిర్మాణానికి, కట్టలింగంపేటలో రూ. 12 లక్షలతో నిర్మిస్తున్న పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్బాబు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదన్నారు. యాదాద్రిని ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నామో మనకు కనిపిస్తున్నదన్నారు.
వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి పనులు, బద్ది పోచమ్మ ఆలయానికి ఇటీవలె భూ సేకరణ పూర్తయిందన్నారు. రూ. 6 కోట్ల సీజీఎఫ్ నిధులతో వేములవాడ నియోజకవర్గంలోని ప్రతి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వసంతపంచమి పర్వదినాన రెండు ఆలయల్లో భూమిపూజ కార్యక్రమం చేయడం చాల సంతోషంగా ఉందన్నారు. నాడు మండలంలో గుక్కెడు తాగు నీటికి అరి గోసలు పడ్డామని, కాని స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎల్లంపల్లి జలాలతో ఎటు చూసినా పచ్చదనం కనిసిస్తుందన్నారు.
ఎల్లంపల్లి జలాల రాకతో మండలంలోని ప్రతి చెరువు నిండు కుండాల మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి రైతు బంధు, రైతు భీమా, రుణమాఫీ, అందుబాటులో ఎరువులు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తు మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవన నిర్మాణానికి రూ. కోటీ 60 లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. సబ్ సెంటర్ల నిర్మాణం పూర్తయి త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాస్ రావు, కేడీసీసీబీ డైరెక్టర్ జలగం కిషన్రావు, ప్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, పార్టీ అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, వైస్ ఎంపీపీ మందాల అబ్రహం, సర్పంచులు ఏనుగుల జమున, గట్టు లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ పెగ్గర్ల రమేశ్రావు, నాయకులు డప్పుల అశోక్, మరాఠి మల్లిక్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.