కరీంనగర్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు రంగారెడ్డి, పొన్నం ప్రభాకర్కు హైదరాబాద్ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఇన్చార్జి మంత్రి నియామకంతో ప్రజా పరిపాలన, అభివృద్ధిపై సమీక్ష, పర్యవేక్షణ నిర్వహించే అవకాశముంటుంది.