Dasari Manohar Reddy | పెద్దపల్లి / పెద్దపల్లి కమాన్ : తెలంగాణ తొలి సీఎంకు నోటీసులివ్వడం సిగ్గుమాలిన చర్య అని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారణ చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ తీశారు.
పెద్దపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులోని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం మీదుగా అయ్యప్ప గుడి, జెండా చౌరస్తా, కమాన్ మీదుగా.. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరకు బైక్ ర్యాలీ తీశారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.