తెలంగాణచౌక్, ఏప్రిల్ 15 : తెలంగాణ రాష్ట్ర సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కోడూరి పరశురామ్గౌడ్ ఏక్రగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్లోని ఓ హోటల్లో సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు వీరగోని పెంటయ్య సమక్షంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయనను ఎనుకున్నారు. ఈ సందర్భంగా పురశురామ్గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ప్రమాదవశాత్తు గాయపడిన గీత కార్మికులకు చిక్సిత కోసం అందించే ఆర్థిక సహాయం రూ.50 వేలు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి గీత కార్మిక సొసైటీకి ఐదెకరాలతోపాటు ఈత వనం కోసం మొక్కలను ఉచితంగా అందించాలని కోరారు. అనంతరం నూతన అధ్యక్షుడిని గౌడ సంఘం నాయకులు ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో గౌడ సంఘం నాయకులు కలర్ సత్తన్న, మల్లేశం గౌడ్, రాజేశ్గౌడ్, లింగయ్య గౌడ్, చంద్రశేఖర్గౌడ్, వెంకటేశ్గౌడ్ పాల్గొన్నారు.