టెన్త్ ఫలితాల్లో ముందంజ
95.32 శాతం అమ్మాయిలు ఉత్తీర్ణత
ఓవరాల్గా రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 15వ స్థానం
జిల్లా వ్యాప్తంగా 93.34 శాతం పాస్
పరీక్ష రాసిన విద్యార్థులు : 12,695
ఉత్తీర్ణులు : 11,849 (93.34 శాతం)
రాష్ట్ర స్థాయిలో జిల్లాకు స్థానం : 15
పరీక్ష రాసిన బాలురు : 6778
ఉత్తీర్ణులు : 6209 (91.61 శాతం)
పరీక్ష రాసిన బాలికలు : 5917
ఉత్తీర్ణులు : 5640 (95.32 శాతం)
కమాన్చౌరస్తా, జూన్ 30 : రాష్ట్ర విద్యాశాఖ గురువారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. 93.34 శాతం ఉత్తీర్ణత సాధించగా, రాష్ట్రంలో జిల్లా 15వ స్థానంలో నిలిచింది. ఈ విద్యా సంవత్సరం 12,695 మంది పరీక్షలు రాయగా 11,849 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 6778 మంది పరీక్షలకు హాజరవగా 6209 మంది ఉత్తీర్ణత సాధించి 91.61 శాతం నమోదు చేసుకున్నారు. 5917 మంది బాలికలు పరీక్షలు రాయగా, 5640 మంది పాసై 95.32 శాతం ఉత్తీర్ణత సాధించారు.
మోడల్, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్ హవా
‘పది’ ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతోపాటు మోడల్, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి సత్తా చాటారు. జిల్లాలో 11 మోడల్ పాఠశాలలుండగా గంగాధర, ఎలగందుల, సైదాపూర్, శంకరపట్నం, వీణవంక పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకున్నాయి. జిల్లాలోని 11 కేజీబీవీ పాఠశాలలకు ఇల్లందకుంట, సైదాపూర్, వీణవంక పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 98.21 శాతం నమోదు చేసుకుని అత్యంత ప్రతిభను చాటాయి. ఎస్సీ గురుకులాల్లో 2014 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 1978 మంది ఉత్తీర్ణత సాధించడంతో పాటు 42 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించడం విశేషం.
సిద్ధ్దార్థ విద్యార్థుల విజయదుందుభి
కమాన్చౌరస్తా, జూన్ 30 : సిద్ధ్దార్థ ఇంగ్లిష్ మీడియం హైసూల్ విద్యార్థులు పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విజయదుందుభి మోగించారు. ఇందులో భాగంగా పాఠశాలకు చెందిన 36 మంది 10 జీపీఏ సాధించగా, 39 మంది 9.8 జీపీఏ, 28 మంది విద్యార్థులు 9.7 జీపీఏ, 32 మంది విద్యార్థులు 9.5 జీపీఏ సాధించి అద్భుత ఫలితాలు సృష్టించారని విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ దాసరి శ్రీపాల్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఐఐటీ క్యాంపస్లో విద్యార్థులను అభినందించి మాట్లాడారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులతా భవిష్యత్తులో అత్తున్నతస్థాయిని అధిరోహించి, తల్లిదండ్రులకు, విద్యనేర్చిన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
10 జీపీఏ లక్ష్యంగా చదివా..
పది ఫలితాల్లో 10 జీపీఏ లక్ష్యంగా చదివాను. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు అదే రోజు చదవడం, చివరలో మరోసారి అన్ని సబ్జెక్టులను రివిజన్ చేసుకోవడంతో ఈ ఫలితం సాధించాను. 10 జీపీఏ సాధనలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. బైపీసీ ఎంపిక చేసుకుని డాక్టర్ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతా.
– ఎం రుషిత, 10 జీపీఏ, సిద్ధార్థ పాఠశాల, కరీంనగర్
ఐఐటీ సాధనే లక్ష్యం..
భవిష్యత్తులో ఐఐటీ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. దీనికోసం పదో తరగతి నుంచి ప్రణాళిక నిర్ణయించుకున్నా. దీనిలో భాగంగానే 10వ తరగతిలో 10 జీపీఏ సాధించా. మా డాడీ అధ్యాపకుడు కావడం నాకు మరింత తోడ్పాటునందించింది. సిద్ధార్థ పాఠశాలలో ప్రణాళికా ప్రకారం బోధిస్తుండడంతో అత్యధిక ఫలితాలు వస్తున్నాయి. – లాస్యశ్రీ, 10 జీపీఏ, సిద్దార్థ పాఠశాల
అల్ఫోర్స్ హవా
139 మంది విద్యార్థులు 10 జీపీఏ
కమాన్చౌరస్తా, జూన్ 30 : అత్యుత్తమ విద్యకు మారుపేరులా ఉంటున్న అల్ఫోర్స్ విద్యాసంస్థలు పదో తరగతి ఫలితాల్లో మరోసారి తమ హవా కొనసాగించాయి. ఈ సందర్భంగా వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనిటాన్స్ ప్రాంగణంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్రెడ్డి అభినందించి మాట్లాడారు. పాఠశాలకు చెందిన 139 మంది విద్యార్థులకు 10 జీపీఏ రావడం గర్వకారణమన్నారు. అలాగే, 141 మంది విద్యార్థులు 9.8 జీపీఏ, 100 మంది విద్యార్థులు 9.7 జీపీఏ కైవసం చేసుకున్నారని తెలిపారు. తమ విద్యాసంస్థలు ఉత్తమ ఫలితాలకు నిలయమన్నారు.
డాక్టర్ కావాలన్నదే లక్ష్యం
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో మంచి మార్కులు సాధించా. మొదటి నుంచీ డాక్టర్ కావాలన్నదే నా లక్ష్యం. అందుకోసం కష్టపడి చదివా. అనుకున్న మార్కులు సాధించా. మున్ముందు కూడా భవిష్యత్తుకు బాటలు వేసుకునేలా చదివి, మంచి మార్కులు సాధిస్తా.
– రాచకొండ శ్రీ సాయి వైష్ణవి, అల్ఫోర్స్ విద్యాసంస్థలు
ప్రణాళికతో ముందుకు సాగుతా
అల్ఫోర్స్ విద్యాసంస్థలో చదివి మంచి మార్కులు సాధించాను. ఉన్నతంగా ఎదగాలంటే ఉన్నత చదువులు చదవాలి. అందుకోసం భవిష్యత్తు కోసం ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతా. ఇంటర్లో మంచి మార్కులతో, ఐఐటీలో సీటు సాధించి మంచి ఉద్యోగం సాధించాలన్నదే నా కోరిక.
– సీహెచ్ అనూహ్య, అల్ఫోర్స్ విద్యాసంస్థలు
ట్రినిటి విజయకేతనం
వందశాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు
అభినందించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, చైర్మన్ ప్రశాంత్రెడ్డి
పెద్దపల్లి కమాన్, జూన్ 30: పదో తరగతి ఫలితాల్లో పెద్దపల్లి ట్రినిటి హైస్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 362 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, అందరూ ఉత్తీర్ణత సాధించారు. 59 మంది 10 జీఈఏ, 56 మంది 9.8 జీపీఏ, 47 మంది 9.7జీపీఏ సాధించారు. విద్యార్థులను ట్రినిటి ఫౌండర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి అభినందించారు.