రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా శనివారం హైదరాబాద్లోని జలవిహార్లో బాధ్యతలు స్వీకరించిన గెల్లు శ్రీనివాస్యాదవ్కు అభినందనలు వెల్లువెత్తాయి. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్ గౌడ్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
హుజూరాబాద్టౌన్, ఏప్రిల్ 15: హైదరాబాద్లోని జలవిహార్లో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా శనివారం బాధ్యతలు స్వీకరించిన గెల్లు శ్రీనివాస్యాదవ్కు మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు. కాగా, గెల్లు శ్రీనివాస్యాదవ్ను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్యాదవ్, గంగుల కమలాకర్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, శాసనమండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, దాస్యం వినయ్భాసర్, సతీశ్కుమార్, రసమయి బాలకిషన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మేకల, గొర్రెల కమిషన్ చైర్మన్ బాలరాజు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సతరించారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి తరలిన నాయకులు
టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హుజూరాబాద్ నుంచి భారీగా వాహనాల్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్కు తరలివెళ్లారు. శ్రీనివాస్యాదవ్కు శుభాకాంక్షలు తెలిపి, శాలువాలతో సతరించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక-శ్రీనివాస్, బీఆర్ఎస్ హుజూరాబాద్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు తాళ్లపెల్లి శ్రీనివాస్గౌడ్, మారెపల్లి సుశీల, కల్లెపల్లి రమాదేవి, యాదగిరినాయక్, నాయకులు వొడితెల ప్రణవ్బాబు, ఖాళీద్హుస్సేన్, ఉప్పు శ్రీనివాస్పటేల్, గంట మధుకర్, రావుల రాజేశ్, తాళ్లపెల్లి రమేశ్గౌడ్, సంపంగి రాజేందర్, బుర్ర కుమార్, తులసి లక్ష్మణమూర్తి, కొలిపాక సమ్మయ్య, ఇప్పలపల్లి చంద్రశేఖర్, బోళ్ల రమేశ్, దండ విక్రంరెడ్డి, ప్రతాప కృష్ణ, కొండ్ర నరేశ్, విడపు అనురాగ్, గొడిశాల పావని, కొయ్యడ శ్రీదేవి, నిమ్మటూరి సాయికృష్ణ, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట, ఏప్రిల్ 15: రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ బాధ్యతల స్వీకరణ మహోత్సవానికి మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న-కోటి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, నాయకులు హైదరాబాద్కు భారీగా తరలివెళ్లారు. శ్రీనివాస్ యాదవ్కు పుష్పగుచ్ఛాలు అందించారు. శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అభినందనలు తెలిపారు. ఉద్యమ బిడ్డకు సీఎం కేసీఆర్ అందించిన గొప్ప గౌరవమని కొనియాడారు. గెల్లు మరెన్నో పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇక్కడ కౌన్సిలర్లు, నాయకులు, తదితరులున్నారు.
కార్పొరేషన్, ఏప్రిల్ 15: టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.