ఉద్యమకారుడికే మరో రాష్ట్ర స్థాయి పదవి దక్కింది. బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేయగా, ఆ కాపీని హైదరాబాద్లో స్వయంగా సీఎం కేసీఆర్ గెల్లు శ్రీనివాస్కు అందించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని హుజూరాబాద్ నియోజకవర్గానికే చెందిన బండ శ్రీనివాస్కు ఇవ్వగా, ఇప్పుడు మరో పదవి ఇదే నియోజకవర్గానికే చెందిన ఉద్యమ నేతకు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ మేరకు పార్టీ శ్రేణులు హుజూరాబాద్ నియోజకవర్గంలో సంబురాలు జరుపుకొన్నారు.
హుజూరాబాద్టౌన్/ వీణవంక, ఏప్రిల్ 4 : ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్కు రాష్ట్రస్థాయి పదవి వరించింది. ఆయనను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేయగా, ఉత్తర్వు కాపీని ముఖ్యమంత్రి స్వయంగా గెల్లుకు అందజేశారు. కాగా, ఇంతకు ముందు ఇదే నియోజకవర్గానికి చెందిన బండ శ్రీనివాస్ను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన విషయం తెలిసిందే. కాగా.. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను గెల్లు శ్రీనివాస్యాదవ్ మర్యాద పూరకంగా కలిసి పూల బొకే ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. గెల్లు నియామకంపై హర్షం వ్యక్తం చేస్తూ నియోజకవర్గంలోని పలుచోట్ల బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. కాగా, గెల్లు నియామకంపై ఓసీ సంఘాల జేఏసీ తరఫున ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. అతన్ని నియమించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
పేరు: గెల్లు శ్రీనివాస్ యాదవ్
పుట్టిన తేదీ: 21.08.1983
భార్య : శ్వేత
పిల్లలు : సంఘమిత్ర(కూతురు), తారకరామారావు(కొడుకు)
తండ్రి పేరు: గెల్లు మల్లయ్య (మాజీ.ఎంపీటీసీ కొండపాక)
తల్లి పేరు: లక్ష్మి (మాజీ సర్పంచ్, హిమ్మత్ నగర్)
విద్యార్హతలు: ఎంఏ, ఎల్ఎల్బీ
పరిశోధక విద్యార్థి (రాజనీతి శాస్త్రం)
సామాజిక వర్గం: బీసీ (యాదవ్)
నివాస స్థలం : వీణవంక మండలం హిమ్మత్ నగర్
పదవులు : భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి
తెలంగాణ ఉద్యమంలో.. : డిగ్రీ చదువుతున్న కాలం నుంచే విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. హైదరాబాద్ అంబర్పేట్లోని ప్రభుత్వ బీసీ హాస్టల్లో ఉంటూ (2003-2006) బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడారు. ఏవీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమానికి , కేసీఆర్ ప్రసంగాలకు ఆకర్శితులై క్రియాశీలకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
తిమ్మాపూర్, ఏప్రిల్4: తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా నియామకమైన గెల్లు శ్రీనివాస్యాదవ్కు బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి మాదాడి రమేశ్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. టూరిజం కార్పొరేషన్ పదవిని ఎంతో నమ్మకంతో సీఎం కేసీఆర్ అప్పగించారని చెప్పారు.
జమ్మికుంట, ఏప్రిల్ 4 : రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా గెల్లు శ్రీనివాస్యాదవ్ను నియమించడంపై జమ్మికుంటలో మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. పటాకలు కాల్చి, స్వీట్ల పంపిణీ చేశారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినదించారు. ఉద్యమకారుడికి సముచిత స్థానం కల్పించారని, పార్టీకి రుణపడి ఉంటామని తెలిపారు. ఇక్కడ శ్రీపతి నరేశ్, ఆవుల తిరుపతి, గిరవేన శ్రీనివాస్ యాదవ్(హరిప్రియ మెడికల్), మార్క స్వరాజ్, పాత రాజేశ్, పసునూటి నరేందర్, లింగంపల్లి శ్రీనివాస్, రాఘవేంద్ర, మణికంఠ, గణేశ్, శివ, పాల్గొన్నారు.