Boinpally | బోయినపల్లి రూరల్, జూలై 22 : బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కరీంనగర్ పార్లమెంట్ మాజీ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను బుధవారం మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేకులు కోసి, సీట్లు పంచిపెట్టారు. మండల కేంద్రంలో ని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల మాజీ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని బీఆర్ఎస్ శ్రేణులు మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొంకటి లచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ సత్తినేని మాధవ్, సింగిల్ విండో చైర్మన్ చైర్మన్ తీపి రెడ్డి కిషన్ రెడ్డి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, నాయకులు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, కొంకటి శేఖర్, అక్కన్నపల్లి కరుణాకర్, బత్తిని కమల్ గౌడ్, కన్నం సాగర్, చిందం రమేష్, ముద్దం రవి, బోయిని రాజు, రాములు, బీ రమేష్, సంజీవ్, మల్లారం చందు, ఎండీ రషీద్ తదితరులు పాల్గొన్నారు.