గోదావరిఖని, జనవరి 1: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 10 ఏండ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించిందని, ప్రతి ఇంటికీ సంక్షేమం.. ప్రతి ముఖంలో ఆనందం నింపారని రామగుండం తాజా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కొత్త సంవత్సరం వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమంలో రామగుండం ప్రాంత ప్రజలు సాగించిన పోరాటం చారిత్రాత్మకం అన్నారు. తొలి సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్ర భాగాన నిలిపారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పార్టీ శ్రేణులకు సముచిత స్థానం వస్తుందన్నారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. రాబోయే ఎన్నిక్ల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్నారు. ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తామన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రామగుండం నియోజక వర్గంలో మెడికల్ కళాశాల, సబ్ రిజిస్టర్ కార్యాలయం, ఇండస్ట్రియల్ పార్కు, సీనియర్ సివిల్ కోర్టు జడ్జి భవనం సాధించామన్నారు.
నియోజక వర్గంలోని పార్టీ నాయకులకు, కార్మికులకు కర్షకులకు సకల జనులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలోడిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్ ఇంజపురి పులెందర్, దొంత శ్రీనివాస్, ధాతు శ్రీనివాస్, సాగంటి శంకర్, కృష్ణవేణి, నాయకులు గోపు ఐలయ్య, మురళీధర్రావు, రాంమ్మూర్తి, మొగిలి, దాసరి ఎల్లయ్య, సత్యప్రసాద్, అచ్చవేణు, మారుతి, తిరుపతి, పిల్లి రమేశ్, దొమ్మటి వాసు, దేవరాజు, ఓదెలు, జక్కుల తిరుపతి, తోకల రమేశ్, రాములు, అమరేందర్, సంధ్యారెడ్డి, సరోజన, రమాదేవి తదితరులున్నారు.