ధర్మపురి, డిసెంబర్ 31: ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో ఆదివారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనకు సిబ్బంది సాదర స్వాగతం పలికారు. అర్చకులు ప్రధాన, అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు.
అనంతరం ఆశీర్వచన మండపంలో స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, జడ్పీటీసీ బత్తిని అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్, దేవస్థానం రెనొవేషన్ కమిటీ సభ్యులు ఇందారపు రామన్న, నాయకులు ఇనుగంటి వెంకటేశ్వరరావు, చిలివేరి శ్యాంసుందర్, సాంబమూర్తి ఉన్నారు.