ఫర్టిలైజర్సిటీ, సెప్టెంబర్ 2: ‘ప్రపంచంలోనే గొప్ప ఎత్తిపోతల పథకంగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ నేతలు దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారు. చట్టసభల్లో గొప్ప ప్రాజెక్టు అని కీర్తించిన వారే ఇప్పు డు రాజకీయ సభల్లో విఫల ప్రాజెక్టు అని విమర్శలు చేయడం విడ్డూరం’ అంటూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నిప్పులు చెరిగారు. గోదావరిఖనిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ ఫలాలతో ఇంటింటా చిరునవ్వులు విరబూస్తున్న తెలంగాణలో బీజేపీ నాయకు లు చిచ్చుపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బా ధ్యాతారహితంగా కాళేశ్వరం విఫల ప్రాజెక్టు అని మా ట్లాడుతున్నారని విమర్శించారు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఐటీ, ఈడీ దాడులకు తెలంగాణ ప్రభుత్వం బెదరబోదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతిలిచ్చిన వారే అడ్డగోలుగా మాట్లాడడం సరికాదన్నారు. బీజేపీ నేతల తీరును గ్రామగ్రామనా ఎండగట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక్కడ రామగుండం మేయర్ డా క్టర్ అనిల్కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు బొడ్డు రవీందర్, పీటీ స్వామి, దాతు శ్రీనివాస్, దొంతు శ్రీనివాస్, బాలరాజ్కుమార్, సంజీవ్, అచ్చె వేణు, నారాయణదాస్ మారుతి, తిరుపతి ఉన్నారు.