రాజన్న సిరిసిల్ల, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠకు తెరపడింది. ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాలలో సిరిసిల్ల అభ్యర్థిగా కేటీఆర్ విజయకేతనం ఎగురవేశారు. అభివృద్ధి ప్రదాత రామన్న వెన్నంటే ఉంటామంటూ సిరిసిల్ల ప్రజలు మరోసారి రుజువు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినప్పటికీ, కేటీఆర్ను తమ ఎమ్మెల్యేగా గెలిపించుకొని కృతజ్ఞతను చాటారు.
2009 నుంచి వరుసగా సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన ఆయనకే, ఐదోసారి నియోజకవర్గ ప్రజలు పట్టంకట్టారు. నేతన్నల బతుకు చిత్రాన్ని మార్చినందుకు నేత కుటుంబాలు సైతం రామన్నకే జై కొట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీలో బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ విజయం సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్, బీజేపీకి మూడో స్థానం లభించింది. ఆదివారం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతి గృహంలో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ నిర్వహించారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం 14టేబుళ్లు, 21 రౌండ్లు లెక్కించారు. ప్రతి రౌండ్లో కేటీఆర్కు ఓటర్లు మెజార్టీ ఇచ్చారు. కేటీఆర్కు 88,761 ఓట్లు రాగా, కాం గ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్రెడ్డికి 58,916, బీజేపీ అభ్యర్థి రాణీరుద్రమరెడ్డికి 29,710ఓట్లు వచ్చాయి. 29,687ఓట్ల మెజార్టీతో రామన్న గెలుపొందారు. మొదటి రౌండ్లో బీఆర్ఎస్ 3,206, కాంగ్రెస్ 3,002, బీజేపీ 449, 2వ రౌండ్లో బీఆర్ఎస్ 3,547, కాంగ్రెస్ 2,190, బీజేపీ 1,285, 3వ రౌండ్లో బీఆర్ఎస్ 3,446, కాంగ్రెస్ 2,3 86, బీజేపీ 1,029, 4వ రౌండ్లో బీఆర్ఎస్ 4,026, కాంగ్రెస్ 2,898, బీజేపీ 847, 5వ రౌండ్లో బీఆర్ఎస్ 4105, కాంగ్రెస్ 2,525, బీజేపీ 1149, 6వ రౌండ్లో బీఆర్ఎస్ 4,861, కాంగ్రెస్ 2,666, బీజేపీ 791, 7వ రౌండ్లో బీఆర్ఎస్ 3,457. కాంగ్రెస్ 3,020, బీజేపీ 736, 8వ రౌండ్లో బీఆర్ఎస్ 5,382, కాంగ్రెస్ 2,877, బీజేపీ 1,211, 9వ రౌండ్లో బీఆర్ఎస్ 4,765, కాంగ్రెస్ 2,061,
బీజేపీ 857, 10వ రౌండ్లో 6,216, కాంగ్రెస్ 2,081, బీజేపీ 1,204, 11వ రౌండ్ బీఆర్ఎస్ 6,076, కాంగ్రెస్ 2,308, బీజేపీ 1,149, 12వ రౌండ్లో బీఆర్ఎస్ 6,526, కాంగ్రెస్ 2,303, బీజేపీ 1,003, 13వ రౌండ్లో బీఆర్ఎస్ 3,388, కాంగ్రెస్ 2,665, బీజేపీ 656, 14వ రౌండ్లో బీఆర్ఎస్ 4,455, కాంగ్రెస్ 3,281, బీజేపీ 552, 15వ రౌండ్లో 4,315, కాంగ్రెస్ 3,588, బీజేపీ 720, 16వ రౌండ్లో బీఆర్ఎస్ 3,558, కాంగ్రెస్ 3,944, బీజేపీ 932, 17వ రౌండ్లో 4,522, కాంగ్రెస్ 3,500, బీజేపీ 1,089, 18వ రౌండ్లో 3,574, కాంగ్రెస్ 4,124, బీజేపీ 913, 19వ రౌండ్లో బీఆర్ఎస్ 4,072, కాంగ్రెస్ 3,385, బీజేపీ 954, 20వ రౌండ్ బీఆర్ఎస్ 3,964, కాంగ్రెస్ 3,595, బీజేపీ 493, 21వ రౌండ్లో బీఆర్ఎస్ 1,300, కాంగ్రెస్ 1,517, బీజేపీ 165 ఓట్లు వచ్చాయి.
సిరిసిల్ల శాసన సభ్యుడిగా కేటీఆర్ ఎన్నిక కాగా, ఆయన తరపున పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపా ణి, చీటి నర్సింగరావు, మండల శాఖ అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, కుంబాల మల్లారెడ్డికి రిటర్నింగ్ అధికారి ఆనంద్కుమార్ కౌంటింగ్ హాల్లో ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఐదోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కేటీఆర్ గెలుపొందడంపై పార్టీ కార్యకర్తలు సంబురాలు జరుపుకొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, చీటి నర్సింగరావు ఆధ్వర్యంలో నేతలు అంబేద్కర్ చౌరస్తాలో పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, తంగళ్లపల్లి మండలాల్లో నాయకులు సంబురాల్లో పాల్గొన్నారు.