బోయినపల్లి, డిసెంబర్ 19: సెస్ ఎన్నికల్లో రైతులు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకే పట్టం కడతారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని మాన్వాడలో సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కొట్టెపల్లి సుధాకర్తో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల కోసం దేశంలోనే ఎక్కడా లేని పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. దీనిని ఓర్వలేకే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అనేక ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ప్రజలు పట్టించుకోరని స్పష్టం చేశారు.
ఆ రెండు పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి ప్రేమ్సాగర్రావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్రెడ్డి, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యనారాయణరెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, ఏఎంసీ వైస్ ఛైర్మన్ చిక్కాల సుధాకర్రావు, సర్పంచులు ఇల్లందుల శంకర్, ల్యాద నవిత, ఎంపీటీసీ ఐరెడ్డి గీతా, సింగిల్ విండో చైర్మన్ దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.