సైదాపూర్ : కరీంనగర్ సైదాపూర్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ధర్నా చేశారు. పలు గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం ఉదయమే సింగిల్ విండో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. సొసైటీ గోదాం ముందు చెప్పులతో క్యూ పెట్టారు. మధ్యాహ్నం వరకు రైతులు వేచి చూశారు. కొంత మంది రైతులలు ఉదయం టిఫిన్ బాక్స్ లతో వచ్చి సొసైటీ వద్దనే అన్నం తిన్నారు.
మధ్యాహ్నం ఐనా యూరియా రాకపోవడంతో విసిగి పోయిన రైతులు సహకార సంఘం గోదాం ఎదుట ప్రధాన రహదారి పై ధర్నా రాస్తారోకో చేశారు. తమకు యూరియా వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. సైదాపూర్ ఎస్ ఐ తిరుపతి ధర్నా వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడి శాంతింప జేశారు. పొద్దంతా యూరియా కోసం వేచి చూస్తే దొరకడం లేదని ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమాజశమని రైతులు ప్రశ్నిస్తున్నారు.