Chigurumamidi | చిగురుమామిడి, సెప్టెంబర్ 8 : చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లోని రైతుల పంటలకు విద్యుత్ కోతలతో వరి పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని విద్యుత్ కోతులకు నిరసనగా రైతులు చిగురుమామిడి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ను మంగళవారం ముట్టడించారు. చిగురుమామిడి మండల పరిధిలోని చిగురుమామిడి సీతారాంపూర్ లంబాడి పల్లి గ్రామానికి చెందిన రైతులు సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. విద్యుత్ సిబ్బంది అధికారులు విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ కోతల కారణంగా వరి పంట పూర్తిగా ఎండిపోయే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రైతులు హెచ్చరించారు.
సంఘీభావం ప్రకటించిన బీఆర్ఎస్ నాయకులు
విద్యుత్ సమస్యతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన చేస్తున్న రైతులకు బీఆర్ఎస్ చిగురుమామిడి మండల శాఖ సంఘీభావం ప్రకటించింది. ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతుందని ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని నాయకులు ఆరోపించారు. ప్రజా సమస్య పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. సంఘీభావం ప్రకటించిన వారిలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మామిడి అంజయ్య, మండల నాయకులు కత్తుల రమేష్, శ్యామకూర సంపత్ రెడ్డి, మేదరవేణి ప్రవీణ్ కుమార్ కాసర్ల హరీష్, ఎస్ కే సిరాజ్, కాశబోయిన విజయలక్ష్మి, రాజు, వంగమల్లయ్య తదితరులు ఉన్నారు.