చొప్పదండి(రామడుగు) డిసెంబర్ 7: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేటకు చెందిన రామచంద్రారెడ్డికి ఉత్తమ ఉద్యానవన మిలియనీర్ రైతు అవార్డు వరించింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, కృషి జాగరణ్ సంయుక్తంగా ఏటా మిలీనియం ఫార్మర్స్ మీట్ పేరిట పురస్కారాలు అందిస్తున్నాయి. 2023లో ఈ పురస్కారానికి రామచంద్రారెడ్డిని ఎంపిక చేశాయి. బుధవారం రాత్రి ఆయన ఢిల్లీలో నిర్వహిస్తున్న జాతీయ మేళాలో ఆయనకు కేరళ మాజీ గవర్నర్ సదాశివం, మహేంద్ర గ్రూప్స్ అధినేత రాజమహేంద్ర చేతులమీదు గా అవార్డును అందుకున్నారు.
రామచంద్రారెడ్డి 25 సంవత్సరాల నుంచి పంట మార్పిడి చేస్తూ సాగులో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాడు. బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, మస్క్మిలన్, లిచి, ఊష్ణ యాపిల్, పుచ్చ, దోసలాంటి పంటలు సాగుచేస్తూ అధిక దిగుబడితో పాటు ఏటా లక్షలాది రూపాయల నిఖర ఆదాయాన్ని పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. రామచంద్రారెడ్డి సాగు, మారెటింగ్, తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న సంస్థ జాతీయ ఉత్తమ రైతు అవార్డుకు ఎంపిక చేశారు. తనకు అవార్డు రావడం సంతోషంగా ఉన్నదని రామచంద్రారెడ్డి చెప్పారు.