జగిత్యాల, సెప్టెంబర్ 2 : జగిత్యాలలోని అల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం ఫాంటసీ- 2022 పేరుతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు నృత్యాలతో అదరహో అనిపించారు.
అంతకు ముందు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి, అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి, సరస్వతీ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి లక్ష్యం వైపు అడుగులు చేయాలని కోరారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలపై అవగాహన ఉండాలని సూచించారు.
జ్యోతిప్రజ్వలన చేస్తున్న జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి, చిత్రంలో అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి