Karimnagar | ముకరంపుర, జులై 22 : యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణకు ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి కరీంనగర్ ఎస్ఈ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలిపారు.
ప్రైవేటీకరణను విరమించుకోవాలని, విద్యుత్ సంస్థల్లో అన్ని క్యాడర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, పీఆర్సీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్యోగుల న్యాయమైన 14 డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణారావు, మహేందర్ రావు, శ్రీనివాస్, రఘు, రాజు, సంపత్ కుమార్, యుగంధర్, సంతోష్, రంగు వెంకటనారాయణ, విద్యుత్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.