ఇబ్రహీంపట్నం, నవంబర్ 18: ‘బీజేపీ నాయకుడు ఎంపీగా గెలిచి ఐదేండ్లలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. కులాలు, మతాల పేరిట గ్రామాల్లో చిచ్చు పెట్టడమే తప్పా ఒక్క కుల సంఘానికైనా నిధులిచ్చారా..? ఒక్కసారి ఆలోచించాలి. ఇగ కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి నర్సింగరావు ఐదేండ్ల క్రితం వచ్చిండు. మళ్లీ ఓట్లప్పుడు వచ్చి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అంటున్నడు. ఎన్నికలు వస్తున్నాయంటే వచ్చే వాళ్లను నమద్దు. మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండే మీ బిడ్డ కావాలా..? పరాయివాళ్లు కావాలా..? మీరే ఒకసారి ఆలోచించుకోవాలి’ అని కోరుట్ల అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విజ్ఞప్తి చేశారు. మీకు అందుబాటులో ఉండి సేవలందించే తనను గెలిపిస్తే, మరింత అభివృద్ధి చేస్తానని ఓటర్లను అభ్యర్థించారు. శనివారం ఆయన ఇబ్రహీంపట్నం మండలంలోని కేశాపూర్, కోజన్కొత్తూర్, ఎర్దండి, మూలరాంపూర్, బర్థిపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల డాక్టర్ సంజయ్ కల్వకుంట్లకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికి, ఘనంగా సత్కరించారు. గ్రామ శివారులో నుంచి ప్రధాన కూడలి వద్దకు ర్యాలీగా తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఉద్యోగవకాశాలు కల్పించేందుకు నియోజకవర్గంలో ఐటీ హబ్ ఏర్పాటు చేశానన్నారు. ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని, ఎన్నికలు వస్తున్నాయంటే కాంగ్రెస్, బీజేపీ వాళ్లు వస్తారని, మాయ మాటలు చెప్పి మోసం చేస్తారన్నారు. అటువంటి వాళ్లను నమ్మవద్దన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే కరెంటు మూడు గంటలిస్తామంటున్న రేవంత్రెడ్డి కావాలా..? మరీ 24 గంటలు ఉచితంగా కరెంటిచ్చే కేసీఆర్ ప్రభుత్వం కావాలా..? ప్రజలే ఆలోచించాలన్నారు. సీఎం కేసీఆర్ అరవై ఏండ్ల దరిద్రాన్ని పారదోలి, తొమ్మిదేండ్లలోనే అభివృద్ధి చేసి చూపించాడన్నారు. అటువంటి నాయకుడిని వదులుకుందామా..? చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజల కోసం అహర్నిషలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను మరోసారి గెలిపించాలని అభ్యర్థించారు.
రైతులను ఏనాడు పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు ఏం ముఖం పెట్టుకుని, ఇప్పుడు ఓట్లడిగేందుకు వస్తుందన్నారు. అలాంటి వారిని నమ్మవద్దని, పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలువాలన్నా రు. సీఎం కేసీఆర్ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడని, బీడీ కార్మికులకు ఎలాంటి కటాఫ్ డేట్ లేకుండా పింఛన్ అందిస్తాడన్నారు. తన తండ్రిని ఆదరించినట్లుగానే తనను కూడా ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో ఎంపీపీ జాజాల భీమేశ్వరి, వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పోన్కంటి వెంకట్, సర్పంచులు దాసరి పోశెట్టి, ఆవుల మహేశ్, కల్లెడ లక్షణ, బాసెట్టి చిన్ననర్సయ్య, సంగం సాగర్, ఎంపీటీసీ బోనగిరి గంగు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎలాల దశరథ్రెడ్డి, నాయకులు నేమూరి సత్యనారాయణ, జాజాల జగన్రావు, కంఠం రమేశ్, చిన్నారెడ్డి, జేడీ సుమన్, బోనగిరి భూమేశ్, దాసరి చిన్నరాజన్న, కల్లెడ గంగాధర్, గణేశ్, నేమూరి నరేశ్, నర్సాగౌడ్, శ్రీనివాస్రావు పాల్గొన్నారు.