పెద్దపల్లి కమాన్, జూలై 31 : రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా ముద్రిస్తున్న ‘ఎడ్యూష్యూర్’ మ్యాగజైన్ కవర్పేజీలో ఇన్నోవేషన్లో పాల్గొన్న పెద్దపల్లి విద్యార్థులను మంత్రి కేటీఆర్ అభినందిస్తున్న ఫోటో ప్రచురితమైంది. రాష్ట్ర స్థాయిలో పెద్దపల్లి విద్యాశాఖకు అరుదైన ఖ్యాతి లభించడంపై డీఈవో డీ మాధవి, జిల్లా సైన్స్ అధికారి బీ రవినందన్రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఈవో, జిల్లా సైన్స్ అధికారి మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (హైదరాబాద్) శనివారం విడుదల చేసిన 11వ (మే-జూన్) సంచిక కవర్పేజీపై ఏప్రిల్లో హైదరాబాద్లో జరిగిన ఇన్నోవేషన్ ఛాలెంజ్-2021లో విద్యార్థులను మంత్రి కేటీఆర్ అభినందించే ఫొటో ప్రచురితమైందని తెలిపారు.
గ్రాండ్ ఫినాలెలో విజయకేతనం ఎగురవేసి ప్రథమస్థానంలో నిలిచిన ధర్మారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు జీ శివాణి, బీ తమన్నా, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పెద్దపల్లి జిల్లా సైన్స్ అధికారి రవినందన్రావు ఫొటోలో ఉన్నారని తెలిపారు. అలాగే 5వ బహుమతి పొందిన పెద్దపల్లి మండలం మూలసాల జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు అరవింద్ రెడ్డి, కే లిఖిత్, కే శివకుమార్, అనూష్ రెడ్డి, గైడ్ టీచర్లు, శివకృష్ణ, మమత వివరాలు లోపలి పేజీల్లో ప్రత్యేకంగా ప్రచురించినట్లు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభ అభినందనీయమని డీఈవో కొనియాడారు. జిల్లా సైన్స్ అధికారి, గైడ్ టీచర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు డీఈవోతో పాటు విద్యాశాఖ అధికారులు వీ హన్మంతు, ఎం. రాంరెడ్డి, ఎం. నరేశ్, ఐ. విజయ్కుమార్, అనురాధ, శ్రీనివాస్, ప్రవీణ్కుమార్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.