మల్యాల, ఫిబ్రవరి 10: కొండగట్టు అంజన్న క్షేత్రంపై డ్రోన్ కెమెరా చక్కర్లు కొడుతున్నది. భక్తుల భద్రత, ఇతర కారణాల రీత్యా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో ఫొటోలు తీయొద్దని గతంలోనే నిషేధం విధించారు. శనివారం ఎంపీ బండి సంజయ్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో స్థానిక బీజేపీ నాయకులు నిషేధాజ్ఞలు బేఖాతరు చేశారు.
అంజన్న క్షేత్రంపై డ్రోన్ కెమెరాతో ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ విషయమై ఆలయ పర్యవేక్షకుడు శ్రీనివాసశర్మను సంప్రదించగా, డ్రోన్ కెమెరాకు ఆలయం తరపున ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, తమను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు.