కోరుట్ల, ఆగస్టు 25: ‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పాలన చేతకాదు. అప్పుడు రాష్ట్రంలో, దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేయ లే. ఇ ప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేస్తలేదు. అవి దొందూ దొందే’ అని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు విమర్శించారు. అడుగకముం దే వరాలిచ్చే దేవుడు సీఎం కేసీఆర్ అని, ది వ్యాంగులు ఎవరికి భారం కాకుడదనే ఉద్దేశ్యం తో 4016 పింఛన్ అందిస్తున్నారని కొనియాడారు. కోరుట్ల పట్టణంలోని కట్కం సంగయ్య ఫంక్షన్లో శుక్రవారం నియోజకవర్గంలోని 165 మంది బీడీ టేకేదార్లకు ప్రభుత్వం మం జూరు చేసిన 3,32,640 విలువైన చెక్కులతోపాటు 4928 మంది దివ్యాంగులకు పెంచిన పింఛన్లు 1.98కోట్ల విలువైన చెక్కులను అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ దివాకర్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాల ను దేశమంతా అమలు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని చెప్పా రు.
సీఎం కేసీఆర్ తమ ప్రాంతంలో గెలిస్తే మా జీవితాలు బాగుపడుతాయని మహారాష్ట్ర ప్రజ లు ఆశిస్తున్నారని, ఇటీవల మహారాష్ట్రలో పర్యటించిననప్పుడు బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీ, కాంగ్రెస్కు భయం పట్టుకున్నదని, ఏం మాట్లాడాలో తెలియక ఆగమవుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో సా గుకు 24 గంటల నిరంతర విద్యుత్, రైతుబం ధు, రైతుబీమా అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని విధాలా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు ప్రజలు మద్దతుగా నిలువాలని విజ్ఞప్తి చేశారు. అనారోగ్య కారణాలతో ఎన్నికలకు దూరంగా ఉంటున్నానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన కొడుకు కల్వకుంట్ల సంజయ్ను ఆశీర్వదించాలని కోరా రు.
వైద్యుడిగా సుపరిచితుడైన సంజయ్ గెలుపుతో నియోజకవర్గంలో విద్య, వైద్య రంగం మరింత ప్రగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోంచి తప్పుకోవడం లేదని, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తన వంతు సాయం అందిస్తానని అన్నారు. అంతకుముందు పట్టణంలోని రవీంద్ర రోడ్డులో హిందూ వాహిని సంఘం భ వన నిర్మాణానికి మంజూరైన 3లక్షల నిధుల ప్రొసీడింగ్ పత్రాలను సంఘం సభ్యులకు ఎమ్మె ల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు బం ధు సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావు, ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్, సర్పంచ్ల ఫోరం జిల్లా గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, ఎంపీపీలు తోట నారాయణ, మారు సాయిరెడ్డి, కోరుట్ల, మెట్పల్లి మున్సిపల్ కమిషనర్లు రాజేశ్వర్, జగదీశ్వర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దేశంలో బీడీ టేకేదార్లకు పింఛన్లు అందిస్తు న్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. బీజేపీ అధికారం లో ఉన్న గుజరాత్, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటకలో ఇస్తున్నరా..? చెప్పాలి. కేవలం బీడీ కార్మికులకు మాత్రమే కంటితుడుపుగా రూ. వెయ్యి ఇస్తున్నరు. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నరు. ఇంటింటికీ 2016 ఆసరా పింఛన్ అందిస్తున్నరు. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా లక్ష నూట పదహార్లు అందిస్తున్నరు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ కోతలు పెట్టి, రైతులను గోసపెడుతున్న. ఇక కేంద్రంలోని మోడీ సర్కార్ నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డివిరుస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు మనకు రావాలా..? వారి పాలన మనకు అవసరమా..? తెలంగాణకు చుట్టపు చూపుగా వచ్చే అరువు నాయకుల పాలన మనకు వద్దు. మీరే ఆలోచించండి. ప్రజల కష్ట్టసుఖాల గురించి ఆలోచించే సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలి. బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను దీవించండి. మీ వెన్నంటే ఉంటా. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలుపుతా.
– డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి