Sircilla | కలెక్టరేట్, జూలై 4 : దొడ్డి కొమురయ్య త్యాగం స్ఫూర్తిదాయకమని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల ఐడీఓసీలో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య త్యాగం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని, సమాజ అభ్యున్నతి కోసం నిబద్ధతతో పనిచేయడమే ఆయనకు నిజమైన నివాళి అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, బీసీ అభివృద్ధి శాఖ అధికారి సౌజన్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, కురుమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.