హుజూరాబాద్టౌన్, జూన్ 10: సీఎం కేసీఆర్ దివ్యాంగుల పింఛన్ను రూ.3116 నుంచి రూ. 4,116కు పెంచుతున్నట్లు ప్రకటించడంపై శనివారం హుజూరాబాద్ పట్టణంలో దివ్యాంగులు సంబురాలు జరుపుకొన్నారు. వాహన ర్యాలీ తీశారు. స్వీట్లు పంచారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు శీలం రాజురెడ్డి, మండలాధ్యక్షుడు కంకణాల రవీందర్రెడ్డి, వెంకటరమణ, స్వప్న, అనూష, తిరుపతి, రవి, రాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంటలో..
జమ్మికుంట, జూన్ 10: దివ్యాంగులకు పెన్షన్ రూ.4116కు పెంచుతున్నట్లు ప్రకటించిన సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో దివ్యాంగులు మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని పథకాలు అమలు చేస్తున్నారని, అందులో భాగంగా దివ్యాంగులకు పింఛన్ను మరో రూ.వెయ్యిని పెంచుతున్నారని తెలిపారు. పింఛన్ను సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇక్కడ పలువురు కౌన్సిలర్లు, దివ్యాంగుల సంఘం కమిటీ సభ్యులు, తదితరులున్నారు.
వీణవంకలో..
వీణవంక, జూన్ 10: మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో శనివారం శ్రీ సాయి ఆదర్శ వికలాంగుల సేవా సంఘం అధ్యక్షుడు పైడిమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రూ.3116 ఉన్న దివ్యాంగుల పెన్షన్ను రూ.4116కు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెడ్డిపల్లి సర్పంచ్ పోతుల నర్సయ్య, సంఘం అధ్యక్షుడు పైడిమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వంలోనే దివ్యాంగులకు అన్ని విధాలా న్యాయం జరుగుతున్నదని, రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం సభ్యులు గిరవేన సమ్మయ్య, రాయమల్లు, శ్రీనివాస్, రాజయ్య, సదయ్య, మధునయ్య, అశోక్, చంద్రయ్య, రాజు, బుచ్చయ్య, స్వరూప, రాజిరెడ్డి, మధునయ్య తదితరులు పాల్గొన్నారు.
సైదాపూర్లో..
సైదాపూర్, జూన్ 10: ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ను వెయ్యి రూపాయలు పెంచడంపై మండలకేంద్రంలో దివ్యాంగుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు శీలం రాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, వెన్కేపల్లి సర్పంచ్ కొండ గణేశ్, నాయకులు కొత్త మధుసూదన్రెడ్డి, కూతురు విద్వాన్రెడ్డి, గడ్డం శేఖర్, మొగిలి, ఐలయ్య, శ్రీను, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.