హుజూరాబాద్టౌన్/ జమ్మికుంట/ వీణవంక/ సైదాపూర్/ చిగురుమామిడి/ కమాన్చౌరస్తా/హౌసింగ్బోర్డుకాలనీ/ తిమ్మాపూర్, తెలంగాణచౌక్/ చొప్పదండి, జనవరి 14: జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. ఉదయాన్నే ఇండ్ల ముందు మహిళలు రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో ఆవరణలో మహిళా సిబ్బంది భోగి శుభాకాంక్షలు తెలుపుతూ రంగురంగుల ముగ్గులు వేశారు. తెలంగాణచౌక్లో భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు.
వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జాగృతి రాష్ట్ర నాయకురాలు గందె కల్పన, జిల్లా కోశాధికారి అత్తె రాజారాం, జిల్లా పీఆర్వో గాలిపెల్లి రత్నాకర్, యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఉయ్యాల విష్ణువర్ధన్, విద్యార్థి విభాగం కో-కన్వీనర్ సత్తు సంతోష్, నాయకులు పసుల పవన్, పెంచికల మల్లేశ్, గాలిపెల్లి జగదీశ్, రవి, సుమన్, రాజు తదితరులు పాల్గొన్నారు. మంకమ్మతోటలో కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ-శ్రీనివాస్ ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. కార్యక్రమంలో నాగుల లక్ష్మి, కళావతి, వెంకట్, శంకర్, శ్యాం, ప్రవీణ్, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ పట్టణంలోని సిద్ధార్థనగర్లో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సాగి వీరభద్రారావు, ప్రధాన కార్యదర్శి బండ సంపత్రెడ్డి ఆధ్వర్యంలో కాలనీవాసులు భోగిమంటలు వేశారు. హుజూరాబాద్ పట్టణ శివారులోని రంగనాయకులగుట్ట వద్ద గల పాటిమీద శ్రీహనుమాన్ ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేయగా, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మలాశ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం బండ్లు తిరిగే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జమ్మికుంట పట్టణం, సైదాపూర్ మండలంలోని వివిధ ఆలయాల్లో భోగి పండుగను ఘనంగా నిర్వహించారు.
వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి భోగి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన గంగిరెద్దుకు ఆహారంగా ధాన్యం తినిపించి, బసవన్న ఆశీర్వాదం అందుకున్నారు. వేడుకల్లో జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, సింగిల్విండో చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్విండో డైరెక్టర్లు పాల్గొని ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
భోగి సందర్భంగా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యంలో యువకులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జకుల రవి, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు బోయిని రమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు. నవాబ్పేటలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సర్పంచ్ సుద్దాల ప్రవీణ్, ఎంపీటీసీ మంకు స్వప్న, పోటీల నిర్వాహకులు కూతురు శ్రీనివాస్ రెడ్డి, గూల్ల వెంకటేశ్, బీఆర్ఎస్ నాయకుడు మంకు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపూర్, చొప్పదండి మండలాల్లో ప్రజలు భోగి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు.