పెద్దపల్లి, అక్టోబర్ 10 : ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. కేంద్రం ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని చేశారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్లో డీసీపీ వైభవ్ గైక్వాడ్, అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్ లాల్తో కలిసి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, కోడ్ అమలుపై కలెక్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని, నవంబర్ 3న నోటిఫికేషన్ వస్తుందని, నవంబర్ 3 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, నవంబర్ 13 వరకు నామినేషన్ల స్రూటినీ, నవంబర్ 15 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని వెల్లడించారు.
జిల్లాలో 6,94,612 మంది ఓటర్లు
ఈ నెల 4న ఇచ్చిన ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 6,94,612 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ చెప్పారు. అర్హులైన ప్రతి ఒకరూ ఓటరు జాబితాలో తమ పేరు సరి చూసుకోవాలని, పేర్లు లేనివారు ఈనెల 30 వరకు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 837 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, అవసరమైన మేరకు బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నుంచే కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు.
అమలులో ఆంక్షలు..
కులం, మతం, ప్రాంతంపై విద్వేషాలు పెంచే లా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభ పెట్టొద్దని, బెదిరింపులకు పొల్పొడద్దని, తప్పుడు ప్రచారం చేయద్దొని, ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడ్ వచ్చినప్పటి నుంచే ఆంక్షలు అమలులో ఉంటాయని, ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. రాజకీయ పార్టీల స మావేశాలకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు ఇస్తామని, ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలు లేదని చెప్పారు. ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాలు, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో రాజకీయ సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
ఉల్లంఘిస్తే చర్యలు
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను పరిషరించేందుకు జిల్లా లో 10 సర్వైవ్లెన్స్, 10 ఫ్లయింగ్ స్వాడ్, 5 వీడియో సర్వైవ్లెన్స్ బృందాలు, ఎంసీఎంసీ, ఇతర కమిటీలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. కోడ్ ఉల్లంఘనపై ప్రజలు 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా, సీ-విజల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. సమీకృత కలెక్టరేట్లో ఫిర్యాదుల స్వీకరణకు 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, సీ-విజ ల్ యాప్లో లైవ్ వీడియో అప్లోడ్ చేసిన 100 నిమిషాల గడువులోపు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి చర్యలు తీసుకుంటారని తెలిపా రు. కోడ్ను ఉల్లంఘిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒకరూ సహకరించాలని కోరారు.
గట్టి నిఘా : డీసీపీ వైభవ్ గైక్వాడ్
జిల్లాలో అక్రమ నగదు, లికర్ సరఫరా జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ వైభవ్ గైక్వాడ్ స్పష్టం చేశారు. జిల్లాలో నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, 24 గంటలపాటు నిఘా ఉంచామని తె లిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీ సెక్షన్ పర్యవేక్షకుడు ప్రకాశ్, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ పాల్గొన్నారు.
దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి నుంచే ఓటేసే అవకాశం
మంథని, అక్టోబర్ 10: మంథని నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మంథని ఆర్డీవో హనుమ నాయక్ తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో మొత్తం 288 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇం దులో మోడల్-5, పీడబ్ల్యూ(దివ్యాంగులు) పోలింగ్ కేంద్రాలు-1, మహిళా పోలింగ్ కేంద్రా0లు-5, యువకుల పోలింగ్-1గా ఎంపిక చేశామన్నారు.
వృద్ధులు, దివ్యాంగులు 12డీ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఇంటి వద్ద నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తాన్నామన్నారు. నియోజకవర్గంలో 9 మండలాల ఎంపీడీవోలను, మంథని మున్సిపల్ కమిషనర్ను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారులుగా నియమించామని చెప్పారు. రాజకీయ సమావేశాల కోసం సువిధ, ఫిర్యాదుల కోసం సీవిజిల్ యాప్లను వినియోగించుకోవాలని సూచించారు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోనే పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో ఆఫీసు ఏవో రవీందర్, తహసీల్దార్ రాజయ్య, డీటీ సంతోష్కుమార్ తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే దాసరికి సన్మానం
పెద్దపల్లి, అక్టోబర్10: ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డిని ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మేకల మల్లేశం ఆధ్వ ర్యంలో సన్మానించారు. రెండోసారి కొలువు దీరిన ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో మంగళవారం కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ధర్మకర్తలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. పాలక మండలి సభ్యులు శ్రీకాంత్ గౌడ్, రమేశ్, సతీశ్, మొండయ్య, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.