జగిత్యాల, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ మన రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించింది. కానీ ఏం చేయలేదు. ఇప్పుడు అమలవుతున్న పథకాలు ప్రజలకు అందించాలన్న ఆలోచన రాలేదు. కనీసం ఒక్క రంగాన్ని అయినా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఎటు చూసినా అస్తవ్యస్తమే. ప్రజలకు అన్నీ అవస్థలే. ఇప్పుడేమో ఎన్నికలు వస్తున్నాయని గ్యారెంటీలంటూ నమ్మిస్తున్నరు. నేనొక్కటే అడుగుతున్నా.. వారి పాలనలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం చేతగానోళ్లు.. ఇప్పుడు చేస్తరా..? మీరే ఆలోచించండి’ అంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. తొమ్మిదేండ్లలోనే రాష్ర్టాన్ని గొప్పగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ నాయక్వతం కావాలా..? 50 ఏండ్లు అధికారంలో ఉండి కరెంటు ఇవ్వక, నీళ్లు ఇవ్వక, కనీసం యూరియా ఇవ్వక వ్యవసాయాన్ని పట్టించుకోని ప్రభుత్వం కావాలా..? ఆలోచించుకోవాలని రైతులకు సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఎల్ గార్డెన్స్ ఎమ్మెల్యే సంజయ్ అధ్యక్షతన సారంగాపూర్, బీర్ మండలాలకు చెందిన 666 మందికి గృహ లక్ష్మి లబ్ధిదారులకు రూ.19.38కోట్ల విలువైన ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ అందరినీ ఎంపిక చేసే బాధ్యతను తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్ గృహలక్ష్మి పథకాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని’ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో ప్రతి ఇంట్లో సంక్షేమ పథకం అమలవుతుందని, సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ సర్కారు నిలుస్తున్నదని కొనియాడారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పథకాల అమలు, అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతున్నది చెప్పారు. తెలంగాణ సాధించుకున్న పదేండ్లలోనే ఒక కొత్త మార్పు ఏర్పడిందన్నారు. ఇప్పుడు అమలవుతున్న పథకాలు గత పాలకులు ఎప్పుడూ కూడా ప్రజలకు అందించాలన్న ఆలోచన చేయలేదన్నారు. కనీసం ఒక్క రంగాన్ని అయినా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని మండిపడ్డారు. తెలంగాణ రాకపోతే 24 గంటల కరెంటు వచ్చేదా..? ఒకసారి ఆలోచించాలని సూచించారు. ఎవుసానికి 24 గంటల కరెంటు అవసరమా..? అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ మాట్లాడుతున్నారని, కేవలం మూడు గంటలు సరిపోతుందని ఎద్దేవా చేశాడని గుర్తుచేశా రు. నిజంగా రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతుందా..? అని అడుగడంతో సరిపోదని ఒక్కసారిగా రైతులు లేచి నినదించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడు గంటల కరెంటు ఇచ్చుడే తెలుసునని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకు అదే గ తి పడుతుందన్నారు. కాంగ్రెస్ హాయంలో ప్రభు త్వ దవాఖానాల్లో రోగి చేరితే ఇంటికి వచ్చే పరిస్థితులు లేకపోలేదన్నారు. ఇవ్వాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి కార్పోరేట్ దవాఖానలకు దీటుగా తీర్చిదిద్దారని, మెరుగైన వైద్యం అందుతున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గ్రామాలు పల్లె ప్రకృతి, వైకుంఠధామాలు, ఇంటింటికీ మంచినీళ్లు, సీసీ రోడ్లు లాంటి సౌకర్యాలతో అంచలంచెలుగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మళ్లీ బీఆర్ ప్రభుత్వం ఏర్పాటైతే మరిన్ని సౌకర్యాలు వస్తాయన్నారు. ఎన్నికలు తొందరలోనే ఉన్నాయని, మీరందరూ బీఆర్ ఓటేసి మళ్లీ గెలిపించుకోవాలని సూచించారు.
బీఆర్ అభివృద్ధి: ఎమ్మెల్యే సంజయ్
ఏండ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిందేమీ లేదని, బీఆర్ అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే సంజయ్ పేర్కొన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే మరింత ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రతి మహిళ బీఆర్ మద్దతుగా ఉండాలని ఎమ్మెల్యే సంజయ్ సూచించారు. ఎన్నో పార్టీలు ఈ రాష్ర్టాన్ని 60 ఏండ్లపాటు పాలించాయని, కానీ ఇంకా ఇల్లు, భూమి లేకుండా ప్రజలు ఉన్నారంటే దానికి ప్రధాన కారణం ఎవరో ప్రజలు గ్రహించాలన్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక పల్లెలు, పట్టణాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేయని గ్రామం, సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదన్నారు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలు మళ్లీ బీఆర్ ప్రభుత్వాన్ని ఆదరించి మరింత అభివృద్ధి జరిగేలా చూడాలని కోరారు.
కేసీఆర్ పాలనలోనే సబ్బండవర్గాలకు మేలు
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలో సబ్బండవర్గాలకు మేలు జరుగుతున్నదని జడ్పీ చైర్ దావ వసం త పేర్కొన్నారు. ఎంతో మంది నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇచ్చారన్నారు. గత పాలకులు నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి, డబ్బులు తీసుకొని మోసం చేశారన్నారు. ఇప్పుడు సొంత స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షలు ఇస్తున్నారని చెప్పారు. ఇంకా పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేయడానికి కల్యాణ లక్ష్మి పథకంతో భరోసా కల్పిస్తున్నారని వివరించారు. కార్యక్రమం లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశంగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ కేడీసీసీ జిల్లా మెంబర్ రాంచందర్ ఎంపీపీ జమున, జడ్పీటీసీ మనోహర్ పాక్స్ చైర్మర్లు మల్లారెడ్డి, నరసింహారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాజేందర్ మహిపాల్ వైస్ ఎంపీపీ సురేందర్, జిల్లా, మండల రైతు బంధు కన్వీనర్లు కొలుముల రమణ, రాజేశం, కోల శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ ముక్క శంకర్, ఎంపీటీసీల ఫోరం సుధాకర్ అధికారులు పాల్గొన్నారు.