మానకొండూర్ రూరల్, డిసెంబర్ 1: పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. గురువారం మానకొండూర్ మండ లం గట్టుదుద్దెనపల్లిలో ఇద్దరికి, చెంజర్ల గ్రామంలో ఒకరికి కల్యాణ లక్ష్మి చెక్కులను సుడా చైర్మన్, టీ(బీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశంలోనే ఎక్కడా లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని గుర్తు చేశారు. ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. కాగా, చెక్కులు అందుకున్న లబ్ధిదారులు.. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ సర్పంచ్ దేవ సతీశ్ రెడ్డి, జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ఎంపీటీసీ ఆకుల నర్సింగరావు, నాయకులు ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, ఎండీ గౌడ్, గ్రామస్తులు ఉన్నారు.
గన్నేరువరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ వేకువజామునే పర్యటించారు. తొలిపొద్దు కార్యక్రమంలో భాగంగా గురువారం తెల్లవారుజామునే గ్రామానికి చేరుకున్న ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముదిరాజ్ కాలనీలో కులసంఘ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అనంతరం గుండ్లపల్లి నుంచి గన్నేరువరం వరకు జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. అంతకుముందు ఎమ్మెల్యేకు గ్రామస్తులు పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, జువ్వాడి మన్మోహన్రావు, తీగల మోహన్రెడ్డి, గూడెల్లి ఆంజనేయులు, బూర వెంకటేశ్వర్, గూడూరి సురేశ్, కుమార్, ప్రభాకర్ పాల్గొన్నారు.
మండల కేంద్రానికి చెందిన పస్తెం లచ్చవ్వ, కడమంచి రాజవ్వ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, గురువారం వారి కుటుంబాలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరామర్శించారు. అనాథలైన రెండు కుటుంబాల్లోని చిన్నారులను ఓదార్చారు. బాధిత చిన్నారులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, టీ(బీఆర్ఎస్) నాయకులు ఉన్నారు.