గంభీరావుపేట, జనవరి 12: సీఎం కేసీఆర్ తెచ్చిన కల్యాణలక్ష్మి పథకం ఎన్నో పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నదని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. గంభీరావుపేట మండలంలోని 96 మందికి మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను మాజీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి తహసీల్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం కేజీ టూ పీజీ విద్యాలయ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. విద్యాలయంలో అందిస్తున్న వసతులపై వారు విద్యార్థులతో మాట్లాడారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్యతో కలిసి వారు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, సర్పంచ్ కటకం శ్రీధర్, వైస్ ఎంపీపీ దోసల లత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, తాసీల్దార్ మధుసూదన్రెడ్డి, జడ్పీకోఆప్షన్ సభ్యుడు అహ్మద్, మాజీ ఏఎంసీ చైర్పర్సన్ సుతారి బాలవ్వ, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్ రెడ్డి, లతారెడ్డి, గంద్యాడపు రాజు తదితరులు పాల్గొన్నారు.