ధర్మపురి, నవంబర్ 8: మున్నూరు కాపులు చైతన్యవంతులని, స్వరాష్ట్రంలో అన్నిరంగాల్లో ప్రాధాన్యం కల్పించామని ధర్మపురి అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బుధవారం ధర్మపురి పట్టణంలోని ఎస్హెచ్ గార్డెన్స్లో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. మొదటి నుంచీ మున్నూరుకాపులు బీఆర్ఎస్కు వెన్నుదన్నుగా ఉన్నారనీ, వారి సంక్షేమానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. బీసీల్లో ఎంతో చైతన్యం కలిగిన మున్నూరుకాపులకు బీఆర్ఎస్ సముచిత స్థానం కల్పిస్తున్నదని, ఈ క్రమంలో రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో మున్నూరు కాపులు ప్రధానంగా వ్యవసాయదారులుగా ఉన్నారని, కొన్ని ప్రాంతాల్లో మోతుబరి రైతులుగా, భూస్వాములుగా ఉన్నారని వివరించారు. రైతుబంధు, రుణమాఫీ లాంటి పథకాల్లో ఎక్కువ శాతం వారికే లబ్ధికలుగుతున్నదని, ఈ క్రమంలో మున్నూరు కాపులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాపుగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీల్లో మున్నూరు కాపులు సహా బీసీలకు చోటు లేదని, మొన్నటికి మొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అనుచిత వాఖ్యల వల్లే పొన్నాల లక్ష్మయ్య బయటకు వచ్చారని గుర్తుచేశారు.
అనంతరం మున్నూరు కాపుల పూర్తి స్థాయి మద్దతు బీఆర్ఎస్కే నంటూ ఏకగీవ్ర తీర్మానం చేశారు. అనంతరం మంత్రి ఈశ్వర్ను ఘనంగా సన్మానించారు. ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, జడ్పీటీసీ బత్తిని అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, మండల ఆర్బీఎస్ కన్వీనర్ సౌళ్ల భీమయ్య, పీఏసీఎస్ చైర్మన్ సౌళ్ల నరేశ్, ఆర్బీఎస్ పట్టణ అధ్యక్షుడు వొడ్నాల మల్లేశం, ఆర్బీఎస్ డైరెక్టర్ భారతపు గుండయ్య, కౌన్సిలర్లు వొడ్నాల ఉమాలక్ష్మి, నాయకులు బండి మురళి, స్తంబంకాడి మహేశ్, తదితరులున్నారు..