వేములవాడ టౌన్, జనవరి 1: రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. సోమవారం న్యూఇయర్ మొదటి రోజుకావడంతో సుమారు 50వేల మందికిపైగా తరలివచ్చారు. ఉదయం నుంచే పుణ్యస్నానాలు చేసి, దర్శనం కోసం బారులు తీరారు.
ఆర్జిత సేవల ద్వారా సుమారు 20లక్షల ఆదాయం సమకూరిందని ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్ తెలిపారు. అలాగే జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు మణిగండస్వామి కోడెమొకు చెల్లించుకొని, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.