సిరిసిల్ల సెస్ వైస్ చైర్మన్గా దేవరకొండ తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యమంలో కీలకంగా పనిచేయడమే కాదు, పార్టీలో నిస్వార్థంగా నిబద్ధతతో సేవలందిస్తూ.. రైతుల అండగా నిలుస్తున్న ఆయనకు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్బాబు సముచిత స్థానం కల్పించారు.
రెండోసారి బీఆర్ఎస్ బలపరిచిన సెస్ డైరెక్టర్ అభ్యర్థిగా విజయం సాధించిన తిరుపతికి పదవిని కట్టబెట్టారు. సెస్ చరిత్రలోనే తొలిసారిగా విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన ఆయనకు వైస్చైర్మన్గా అవకాశం కల్పించారు.
మంత్రి, ఎమ్మెల్యేకు రుణపడి ఉంట
బీఆర్ఎస్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే రమేశ్బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతోపాటు రైతులకు నిరంతర విద్యుత్ అందించడంతో నన్ను భారీ మెజార్టీతో ఆశీర్వదించిన్రు. ఇది ప్రజా విజయంగా భావిస్తున్న. వైస్ చైర్మన్గా నన్ను ఏకగ్రీవం చేసినందుకు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణకు రుణపడి ఉంట. వారందరి సహకారంతో రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అండగా నిలుస్త. విద్యుత్ సమస్యలను పరిష్కరిస్త.
– దేవరకొండ తిరుపతి, సెస్ వైస్ చైర్మన్
కోనరావుపేట, డిసెంబర్ 27: కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన దేవరకొండ తిరుపతి తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. నాడు ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ పిలుపుతో ఎమ్మెల్యే రమేశ్బాబు వెన్నంటే నడిచారు. మలిదశ ఉద్యమంలో భాగంగా మండలంలో జరిగిన అనేక ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజల్లో మంచి పేరు సంపాందించారు. 2003లో బీఆర్ఎస్ యూత్ విభాగం మండలాధ్యక్షుడిగా నియామకమై పార్టీలో ఉత్సాహంగా పనిచేశారు.
యువకులకు తెలంగాణ గురించి వివరిస్తూ సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మల దహనాలు, రాస్తారోకోలు నిర్వహించారు. 2014 ఎన్నికల్లో కోనరావుపేటలో 12వ వార్డుసభ్యుడిగా గెలుపొందారు. పార్టీలో చురుగ్గా పనిచేస్తుండడంతో ఎమ్మెల్యే రమేశ్బాబు గుర్తించి అవకాశం కల్పించడంతో 2015-2016 వరకు సెస్ డైరెక్టర్గా పనిచేశారు. అప్పుడు ప్రజల మన్ననలు పొందారు. మరోసారి 2016లో జరిగిన సెస్ ఎన్నికల్లో పోటీచేసి మంచి మెజార్టీతో గెలుపొందారు. 2022లో మరోసారి బీజేపీ బలపరిచిన అభ్యర్థిపై భారీ మెజార్టీతో గెలిచి, సెస్ వైస్చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు.
సెస్ చరిత్రలోనే విశ్వబ్రాహ్మణుడికి తొలిసారి
ఉద్యమంతోపాటు పార్టీలో నమ్మకమైన వ్యక్తిగా, అభివృద్ధే ధ్యేయంగా తిరుపతి పనిచేశారు. విద్యుత్ సమస్యల పరిష్కారంలో నేనున్నానంటూ రైతులకు భరోసానిచ్చారు. ఎమ్మెల్యే రమేశ్బాబు అనుచరుడిగా గుర్తింపు పొందారు. తిరుపతి సేవలను ఎమ్మెల్యే రమేశ్బాబు గుర్తించారు. దీంతో బీఆర్ఎస్ సెస్ డైరెక్టర్ అభ్యర్థిగా తిరుపతికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో ఆయన 905 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తాజాగా ఆయన సెస్ వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సహకారంతో సెస్ చరిత్రలోనే తొలిసారిగా విశ్వబ్రాహ్మణుడికి వైస్చైర్మన్ పదవిని కట్టబెట్టారు.