హుజూరాబాద్టౌన్, ఆగస్టు 24: దళితబంధు లబ్ధిదారులు తమ వ్యాపారాలను ఎప్పటికప్పుడు విస్తరిస్తేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ డాక్టర్ బీ గోపి పేర్కొన్నారు. గురువారం హుజూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట మండలాలలో దళితబంధు లబ్ధిదారులు ప్రారంభించిన యూనిట్లను కలెక్టర్ పరిశీలించి, మాట్లాడారు. దళితబంధు పథకం ద్వారా లబ్ధి పొంది ప్రారంభించిన యూనిట్ల ద్వారా జరిగే ఉత్పత్తులు కేవలం జిల్లా వరకే పరిమితం చేయకుండా మారెట్కు అనుగుణంగా రాష్ట్ర వ్యా ప్తంగా విస్తరింపజేయాలని, అప్పుడే ఆర్థిక ఫలితాలను సాధించగలుగుతామని తెలిపారు.
జూ ట్ బ్యాగుల తయారీని ప్రోత్సహించి, ప్లాస్టిక్ వా డకాన్ని తగ్గించేలా హుజూరాబాద్ నియోజకవర్గంలోని దుకాణాల యజమానులతో సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆర్డీవో రాజును ఆదేశించారు. బృందంగా ఏర్పడి నిర్వహించే వ్యాపార కార్యకలాపాలు సజావుగా జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. దళితబంధు పథకానికి ముందు, తర్వాత జీవితాల్లో వచ్చిన మార్పులను లబ్ధిదారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. కార్యక్రమంలో హుజూరాబాద్ ఆర్డీవో రాజు, జమ్మికుంట మున్సిపల్ చైర్మ న్ టీ రాజేశ్వర్రావు, హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఎస్ సమ్మయ్య, హుజూరాబాద్, జ మ్మికుంట, ఇల్లందకుంట ఎంపీడీవోలు జయశ్రీ, కల్పన, వెంకటేశ్వర్లు, జమ్మికుంట, ఇల్లందకుం ట తహసీల్దార్లు రజిని, రాణి, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు సురేష్, నాగార్జున ఉన్నారు.