రామడుగు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయసాధనను నెరవేరుస్తూ సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన వెదిర గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగంగా ఏర్పాటు చేసిన భూమిపూజ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, ఎల్లాపుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేంకటేశ్వరరావుతో కలిసి హాజరయ్యారు.
ఇందులో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనావిధానంతోనే నేడు బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ల ద్వారా అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చి దళిత బాంధవుడయ్యాడని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ తీగల సంగీత, జడ్పీ కో-ఆప్షన్ శుక్రొద్దీన్, ఎంపీడీవో మల్హోత్రా, చొప్పదండి ఏఎంసీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ కరుణాకర్, ఎంపీటీసీ తొరికొండ అనిల్కుమార్, వార్డు సభ్యులు, డీసీసీ ఉపాధ్యక్షుడు వెన్న రాజమల్లయ్య, ఆర్బీఎస్ గ్రామ కో-ఆర్డినేటర్ లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, నాగుల రాజశేఖర్గౌడ్, అన్నపూర్ణాలచ్చిరెడ్డి, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కుమ్మరి రాము, శనిగరపు అనిల్, అర్జున్, అంజన్కుమార్, జూపాక మునీందర్ పాల్గొన్నారు.