హుజూరాబాద్టౌన్,జూన్ 6: తెలంగాణ దశాబ్ది ఉత్స వాల్లో భాగంగా ఈనెల 8న నిర్వహించనున్న చెరువుల పండుగను విజయవంతం చేయాలని మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి అన్నారు. మంగళవారం హు జురాబాద్లోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హా ల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దూర దృష్టితో రాష్ట్రంలోని చెరువులు, కాలువలను మరమ్మతు చే యించి, బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి నీ టి గోస తీర్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కే సీఆర్ చేసిన అభివృద్ధి దేశంలో ఎకడా లేదన్నారు. రా ష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఏ రా ష్ట్రం లో లేవని, ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్లో కూడా ఇన్ని పథకాలు లేవన్నారు.
తెలంగాణ రాకముందు ఎండకాలంలో నీళ్ల కోసం బిందెలు పట్టుకొని మహిళలు బోరింగ్ల వద్ద బారులు తీరేవారని, స్వరాష్ట్రంలో నీటి గోస తప్పడంతో నిశ్చింతగా ఉంటు న్నారన్నారు. సీఎం కేసీఆర్ హుజురాబాద్ రైతులకు రై తుబంధు కింద రూ. 523. 75 కోట్లు పెట్టుబడి సా యం కింద ఇచ్చారని తెలిపారు. రైతు బీమా ద్వారా మరణించిన 840 మంది రైతు కుటుంబాలకు రూ.42 కోట్లు ఇచ్చారన్నారు. రైతుల కోసం 24 గంటల కరెంట్, దాదాపుగా 32 వేల కనెక్షన్లు ఉన్నాయని, సబ్సిడీ కింద రూ.800 కోట్లను రైతుల కోసం ప్రభుత్వం ఖర్చు చే స్తుందన్నారు. నియోజకవర్గంలో 99,948 వేల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీరు అందుతుందన్నారు. మి షన్ కాకతీయ కింద రూ.111 కోట్లతో చెరువు లను పునరుద్ధరించామన్నారు. పకన ఉన్న మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉందని, అకడ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు తమకు అమలు చే యాలని అక్కడి పాలకులను ప్రజలు కోరుతున్నారని చె ప్పారు. తెలంగాణలోని పథకాలు దేశంలో ఎకడా అమలు కావడం లేదని చెప్పారు. కార్యక్రమంలో రా ష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిప ల్ అధ్యక్షులు గందె రాధికాశ్రీనివాస్, రాజేశ్వర్రావు, ఉపాధ్యక్షులు నిర్మలాశ్రీనివాస్, స్వప్నకోటి, ఎంపీపీలు ఇరుమల్ల రాణీసురేందర్రెడ్డి, వైస్ ఎం పీపీలు, జడ్పీటీసీలు పడిదం బక్కారెడ్డి, శ్రీరాం శ్యాం పాల్గొన్నారు.
మాట నిలుపుకున్న మండలి విప్
హుజూరాబాద్ టౌన్,జూన్6: మండలి విప్, ఎమ్మె ల్సీ పాడి కౌశిక్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల పురపాలక సంఘం పరిధిలోని 13వ వార్డులో శ్రీ భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చి రూ.50 వేల విరాళం ప్రకటించారు. పని ఒత్తిడి కారణంగా గ్రామానికి రాకపోవడంతో ఇటీవల కొందరు బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. దీంతో వారి ప్రచారానికి తెర దింపుతూ మంగళవారం ఆయననే స్వ యంగా 13వ వార్డుకు వచ్చి గ్రామ పెద్దల సమక్షంలో ఇచ్చిన మాట ప్రకారం ఆ డబ్బులు అందజేశారు. దీం తో ఆ వార్డు ప్రజల తరుపున కౌశిక్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ శ్రీ భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రా యి ప్రతిష్ఠాపన కమిటీ నాయకులు భూంపల్లి రా జలిం గం, చందమల్ల బాబు, కొండ్ర కనుకయ్య, మల్ల య్య పాల్గొన్నారు. అలాగే హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో కొండ్ర మొగిలి, మోరే రాములుకు ఇటీవల సీఎంఆర్ఎఫ్ చెకులు మంజూరు కాగా వారి ఇంటికి వెళ్లి చెకులను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ అందించారు.