కార్పొరేషన్, జూలై 2: మహిళలు సంతోషంగా ఉండడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నదని మేయర్ యాదగిరి సునీల్రావు పేర్కొన్నారు. నగరంలో స్థలం అందుబాటులో ఉన్న చోట మహిళా సంఘ భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని 35వ డివిజన్లో రూ.30 లక్షలతో చేపడుతున్న పల్లవి అక్షర దీపం మహిళా సమాఖ్య సంఘ భవన నిర్మాణ పనులకు ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సప్తగిరికాలనీ, శ్రీనగర్ కాలనీ మహిళలు సమాఖ్య సమావేశాలు, చిన్న చిన్న శుభకార్యాలు చేసుకునేందుకు వీలుగా అన్ని వసతులతో మల్టీపర్పస్లో భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం చేపట్టి అవసరాన్ని బట్టి ఫస్ట్ ఫ్లోర్ కూడా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వం, పాలకవర్గం సంతోషంగా ఉంటుందన్నారు. సప్తగిరికాలనీలో అభివృద్ధి పనులు చేపట్టి ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామన్నారు. డివిజన్ వ్యాప్తంగా అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నెట్ వర్, ప్రతి ఇంటికి మంచి నీటి సౌకర్యం, ప్రతి వీధిలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి, ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వసతులను కల్పించడం జరుగుతోందన్నారు.
గతంలో వానకాలం వచ్చిందంటే రోడ్లు, ఇండ్లల్లో నీరు చేసే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం స్టాంవాటర్ డ్రైనేజీ నిర్మాణంతో సమస్య తీరిందన్నారు. సప్తగిరి కాలనీలో ప్రజల సౌకర్యార్థం కూరగాయల మారెట్, కరెంట్ బిల్లులు చెల్లించేందుకు బిల్లుల చెల్లింపుల కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మానేరు డ్యాం ఆనకట్ట కింద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 2 కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్ కూడా నిర్మించామని, త్వరలోనే ప్రారంభం చేస్తామన్నారు. ప్రస్తుతం నగరంలో రోజూ మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో 24 గంటలు మంచినీరు అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శివారు ప్రాంతాలైన సప్తగిరికాలనీ, శ్రీనగర్కాలనీ, ప్రగతినగర్, శివనగర్, రామచంద్రాపురం కాలనీల్లో కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతన్నట్లు తెలిపారు. ధోబీఘాట్ నుంచి బైపాస్ వరకు రోడ్డును త్వరలోనే నిర్మిస్తామని చెప్పారు. కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.