కానిస్టేబుల్ రాత పరీక్షకు అంతా సిద్ధమైంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎగ్జామ్ జరుగనున్నది. ఉమ్మడి జిల్లాలో 14, 188 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానుండగా 19 సెంటర్లను ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును కల్పించారు. 144 సెక్షన్ విధించారు. నగరంలోని లాడ్జిలపై ప్రత్యేక నిఘా ఉంచారు.
– రాంనగర్, ఏప్రిల్ 28
రాంనగర్, ఏప్రిల్ 28 : పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో స్టెఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల(సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ, ఎస్పీఎఫ్, ఎస్ఏఆర్ పీపీఎల్, ఎస్ఎఫ్ఓ) అభ్యర్థుల ఎంపిక పక్రియలో భాగంగా రాత పరీక్ష ఈనెల 30న ఆదివా రం జరుగనున్నది. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిం చ నున్నారు. కరీంనగర్లో 19 కేంద్రాలను ఏ ర్పా టు చేశారు. నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, శ్రీచైతన్య డిగ్రీ, పీజీ కళాశాల, అపూ ర్వ డిగ్రీ కళాశాల, వివేకానంద డిగ్రీ, పీజీ కళాశా ల, ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల, తి మ్మాపూర్ మండలం రామకృష్ణాపూర్ కాలనీలోని వాగేశ్వరి కళాశాల, జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల, శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాల, కరీంనగర్ లోని కిమ్స్ డిగ్రీ, పీజీ కళాశాల, వివేకానంద ఇంజినీరింగ్ కళాశాలల్లో సెంటర్లు ఏర్పాటు చేశారు.
బయోమెట్రిక్ తీసుకోవాలి..
అడిషనల్ డీసీపీ చంద్రమోహన్
అభ్యర్థుల నుంచి నిర్ణీత సమయంలోపు బయోమెట్రిక్ తీసుకోవాలని అడిషనల్ డీసీపీ చంద్రమోహన్ సెంటర్ల నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం ఎగ్జామ్స్ పరిశీలకులతో సమావే శ మ య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. సెంటర్ల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేసేలా చూడాలని, నగరంలోని లాడ్జిలపై నిఘా ఉంచాలని పోలీసు సిబ్బందికి సూచించారు. కేం ద్రాల వద్ద పటిష్ట బందోబస్తు కల్పించాలని కోరా రు. సమావేశంలో రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ శ్రీలక్ష్మి, బయోమెట్రిక్ అధికారి మురళి, పోలీసు అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు ఉన్నారు.