Kaythanpally | పెద్దపల్లి, ఫిబ్రవరి 17( నమస్తే తెలంగాణ)/ పెద్దపల్లి కమాన్: మంచిర్యాల జిల్లా క్యాథన్ పల్లి మున్సిపాలిటీ లో బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీలు సంయుక్తంగా 14 మంది కౌన్సిలర్లు విజయం సాధించి సంపూర్ణమైన మెజారిటీ సాధించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకం చేస్తోందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విమర్శించారు. కేతనపల్లిలో మున్సిపల్ ఎన్నిక సందర్భంగా మాజీ ఎంపీ బాల్క సుమన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై మంగళవారం జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఇలాంటి చర్యలకు పాల్పడం దురదృష్టకరమన్నారు అడ్డమైన దారిలో ఆరాచకం ఇది తప్పుడు విధానం అన్నారు. ప్రభుత్వం, ఎన్నికల అధికారులు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా.. మాజీ ఎంపీ బాల్క సుమన్ కు మద్దతుగా టిఆర్ఎస్ పార్టీ నిలుస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామంలో ఇది దుర్మార్గమని కంచె చేను మేస్తే.. ఆ కంచెను కూడా మేసే వారు వుంటారని పేర్కొన్నారు. అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, బీఆర్ఎస్ వీ జిల్లా అధ్యక్షుడు కొయ్యడ సతీష్ గౌడ్, కౌన్సిలర్ వెన్నం రవీందర్- సుజాత, సలేంద్ర రాముల యాదవ్ ,మోబిన్, ఖదీర్ ఖాన్, కార్తీక్, మండల పార్టీ నాయకులు బాల్సాని ఈశ్వర్ గౌడ్, తీగల సదయ్య , ముత్యాల రాజయ్య,, సుంచు సది,జై, రామ్ రెడ్డి, పడాల సతీష్ గౌడ్, కాశిపాక వాసు, కానీ నరేష్, పల్లె మధు, ఖాదర్, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, బాలసాని నరేష్, ముత్యం లక్ష్మణ్, ధర్మపురి, ప్రేమ్ సాగర్, కిట్టు యాదవ్ తో పాటుగా పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.