వాళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?
సీఎం కేసీఆర్ పాలనలో ఆదర్శంగా రాష్ట్రం
ఎనిమిదేండ్లలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి
స్వరాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి
రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మారంలో టీఆర్ఎస్ మండల కార్యాలయం ప్రారంభం
పెద్ద సంఖ్యలో బొట్లవనపర్తి గ్రామస్తుల చేరిక
ధర్మారం, జూన్19: దేశాన్ని పాలించిన కాంగ్రె స్, ప్రస్తుతం పాలిస్తున్న బీజేపీ ప్రజలకు చేసిందేమి లేదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ప్ర జలకు ఏమి చేయని ఆ పార్టీలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతో సిగ్గు చేటని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో మన రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి ఈశ్వర్ కొనియాడారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించిందని, అన్నిరంగాల్లో ప్రగతి సాధించించదని చెప్పారు. ధర్మారంలో టీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయాన్ని ఆదివారం మంత్రి ప్రారంభించారు. పార్టీ జెండాను ఎగరేశారు. బొట్లవనపర్తికి చెందిన బీజేపీ గ్రామాధ్యక్షుడు బొట్ల శేఖర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆకారి సత్యంతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు సర్పంచ్ రెడపాక ప్రమీల శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఇంకా ఖిలావనపర్తి, ధర్మారం మండల కేంద్రంలోని జక్కన్నపల్లికి చెందిన మహిళలు పెద్ద సంఖ్య లో పార్టీ చేరారు. వీరందరికీ గులాబీ కండువాలు కప్పి మంత్రి ఆహ్వానించారు. అనంతరం కార్యాలయం వద్ద జరిగిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు.
మోదీ పాలనలో బీజేపీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని దుయ్యబట్టారు. బీజేపీ, కాంగ్రెస్పై ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎలాంటి నమ్మకం లేదని విమర్శించారు. ఆ రెండు పార్టీలపై విసుగెత్తే నమ్మకమైన టీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. కాగా ఉదయం కరీంనగర్లోని క్యాంప్ కార్యాలయంలో బొట్లవనపర్తికి చెందిన వివిధ పార్టీల నాయకులు, గౌడ సంఘం నాయకులు, పార్టీ మాజీ మండలాధ్యక్షుడు పెంచాల రాజేశం ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సమావేశానికి పార్టీ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ అధ్యక్షత వహించగా, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, ధర్మారం సర్పంచ్ పూస్కూరు జితేందర్రావు, ఉప సర్పంచ్ ఆవుల లత, ఏఎంసీ వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ గూడూరి లక్ష్మణ్, విండో వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లు, విండో మాజీ చైర్మన్ పూస్కూరు నర్సింగారావు, పార్టి మండల మాజీ అధ్యక్షుడు పెంచాల రాజేశం, పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు కూరపాటి శ్రీనివాస్, దొనికెని తిరుపతి, ఉపాధ్యక్షులు నాడెం శ్రీనివాస్, గాజుల రాజు, పార్టి అనుబంధ మండలాధ్యక్షులు మంద శ్రీనివాస్, దేవి నళినీకాంత్, ఎండీ హఫీజ్, దేవి వంశీకృష్ణ, అజ్మీరా మల్లేశం, పార్టీ పట్టణాధ్యక్షుడు బాస తిరుపతి రావు, ఉపాధ్యక్షుడు గడ్డం మోహన్, పార్టీ పట్టణాధ్యక్షురాలు దేవి లావణ్య, తదితరులు పాల్గొన్నారు.