సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 11: నిత్య యోగా సాధనతో మానసిక ప్రశాంతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. తెలంగాణ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఆదివారం 9వ రాష్ట్ర స్థాయి అంతర్జిల్లా యోగా ముగింపు పోటీలు జరిగాయి. పలు జిల్లాల క్రీడాకారులు ఆసనాలు ప్రదర్శించారు. ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్తోపాటు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిక్కాల రామారావు, యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్రావు హాజరై, మాట్లాడారు. యోగాను ప్రపంచ దేశాలు అనుకరిస్తున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు యోగాను అలవాటు చేయించాలన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, నిర్వాహకులు ఉప్పల శ్రీనివాస్, పాముల దేవయ్య, తదితరులు ఉన్నారు.