రాంనగర్, ఏప్రిల్ 6 : కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో ఈనెల 11న మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు పోలీసు క మిషనర్ సుబ్బారాయుడు తెలిపారు. గురువా రం కమిషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా వివిధ ప్రముఖ దిగ్గజ కంపెనీలను ఒ ప్పించి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐటీ, హోటల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఆమెజాన్, విప్రో వంటి సంస్థలు, ప్రైవేట్ రంగ బ్యాంకులు మేళాలో పాల్గొంటున్నట్లు తెలిపా రు. 7 నుంచి 10వ తరగతి, ఆపై విద్యార్హతలు ఉన్న వారికి సుమారు 4 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
ట్రాన్స్జెండర్లపై ప్రత్యేక దృష్టి
ట్రాన్స్జెండర్లపై జరుగుతున్న దాడులు, వారిపై వస్తున్న ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని వారికి ఉపాధి కల్పించాలన్న ఆలోచనలతో సంస్థలతో మాట్లాడి ఒప్పించామన్నారు. అమెజాన్ లాం టి సంస్థలు కూడా ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపా రు. వందకు పైగా కంపెనీలకు చెందిన ప్రతినిధులు దీనికి హాజరవుతారని, పరిశీలన అనంతరం అక్కడే నియామక పత్రాలు అందజేస్తారని తెలిపారు. పద్మనాయక కల్యాణ మండపం లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గం టల వరకు ఈ మేళా కొనసాగుతుందని, ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతల సర్టిఫికెట్లు, పాస్పోర్టు సైజ్ ఫొటోలతో హాజరు కావాలని కోరా రు. సందేహాలుంటే ఆర్ఎస్ఐలు మహేశ్ 9652169877, తిరుపతి 631955823 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జాబ్ మేళా ప్రారంభానికి రాష్ట్ర పౌర సరఫరా ల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ కర్ణ న్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఎసీపీ తుల శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు నటేష్, లక్ష్మణ్బాబు, దామోదర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.