జగిత్యాల, డిసెంబర్ 2: జగిత్యాల, కోరుట్ల, ధ ర్మపురి నియోజకవర్గాల శాసనసభ ఓట్ల లెకింపు ఆదివారం జరగనుండగా వీఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సంబంధిత అధికార యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. ఈవీఎం లెకింపు కేంద్రమైన వీఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తి స్థాయిలో బందోబస్తు చర్యలు చేపట్టామని పేరొన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ను, అత్యవసర సర్వీసుల వారి ఓట్లను లెకిస్తారని, జగిత్యాల నియోజకవర్గంలో 1,413, కోరుట్లలో 1,121, ధర్మపురిలో 807 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయని తెలిపారు.
అత్యవసర సర్వీసులకు సంబంధించిన ఓట్లు జగిత్యాలలో 23, ధర్మపురిలో 9 పోలయ్యాయని, వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించిన ఓట్లు 1,121 ఓట్లు పోలయ్యాయని తెలిపారు. పోస్టల్, అత్యవసర విభాగాల ఓట్ల లెకింపు అనంతరం ఈవీఎంల ఓట్లు లెకింపు ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి వేర్వేరుగా లెకింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఒక్కో కేం ద్రంలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. జగిత్యాల నియోజకవర్గ ఓట్ల లెకింపు 19రౌండ్లలో పూర్తవుతుందన్నారు. కోరుట్ల నియోజకవర్గ పరిధిలో పోలైన ఓట్లను 19 రౌండ్లలో లెక్కిస్తారు. ధర్మపురి నియోజకవర్గ ఓట్ల లెకింపు 20 రౌండ్లలో జరుగుతుందన్నారు.
ప్రతి నియోజకవర్గానికి 25 మంది మైక్రో అబ్జర్వర్లు, 25 మంది సూపర్వైజర్లు, 25 మంది సహాయకులు, 150 మంది సిబ్బంది ఓట్ల లెకిం పు కేంద్రాల్లో విధులకు నియమించామని పేరొన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి పోస్టల్ బ్యాలెట్లు లెకించడానికి 3 టేబుళ్లను ఏర్పాటు చేయడంతో పాటుగా టీటీపీబీఎస్ ఒకటి చొప్పున ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా ఎ న్నికల పరిశీలకులు పోటీ చేసిన అభ్యర్థుల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల భద్రతను కట్టుదిట్టం గా భద్రపరచామని, కౌంటింగ్కు సంబంధించి అవసరమైన అన్ని సూచనలు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తెలిపారు.