కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 19 : చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు చేనేత వస్ర్తాలను ఆదరించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జిల్లాలోని చేనేత సహకార సంఘాల ప్రతినిధులు సోమవారం కలెక్టర్ను ఆమె చాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా చేనేత ఉత్పత్తులను పరిశీలించి, కార్మికుల నైపుణ్యాన్ని కొనియాడారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ, చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం ప్రభుత్వ అధికారులంతా చేనేత వస్ర్తాలు ధరించేలా చర్యలు తీసుకుంటానన్నారు. అలాగే, ప్రజావాణి సమయంలో కలెక్టరేట్లో చేనేత వస్ర్తాల స్టాళ్లు ఏర్పాటు చేసుకుని, విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్స్ ఏడీ చరణ్, తదితరులు పాల్గొన్నారు.