తిమ్మాపూర్, ఫిబ్రవరి 12: దివ్యాంగ పిల్లలకు అండగా ఉంటామని కలెక్టర్ పమేలా సత్పతి భరోసానిచ్చారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని మానసిక దివ్యాంగుల పాఠశాలను సోమవారం సాయంత్రం ఆమె సందర్శించారు. విద్యార్థులను ఆప్యాయంగా పలకరిస్తూ, సమస్యలు అడిగి తెలుసుకున్నా రు. విద్యార్థులకు తగ్గట్టుగా విద్యనందిస్తున్న టీచర్లు, సిబ్బందిని అభినందించారు. అలాగే, వారధి సంస్థ ద్వారా ఆధ్వర్యంలో విద్యార్థులకు రూ.6లక్షల విలువైన 120 బెడ్స్ అందజేశారు.
గ్రూప్స్కు సిద్ధమవుతున్న ఇద్దరు అభ్యర్థులకు రూ.18 వేల విలువైన పుస్తకాలు పంపిణీ చేశారు.కలెక్టర్ మాట్లాడుతూ, వారధి సొసైటీ ద్వారా సామాజిక కార్యక్రమాల కోసం రూ. కోటిన్నర మంజూ రు చేసినట్లు చెప్పారు. ఉద్యోగార్థుల కోసం ఉచిత కోచింగ్ ఇస్తామన్నారు. కార్యక్రమం లో పాఠశాల ట్రస్ట్ చైర్మన్ చాడ వెంకటరెడ్డి, మాజీ చైర్మన్ గొట్ట భూపతి, జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, వారధి సొసైటీ కోఆర్డినేటర్ ఆంజనేయులు, సభ్యులు పాల్గొన్నారు.