పెద్దపల్లి, ఫిబ్రవరి 9 : జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, సిజేరియన్లు తగ్గించాలని కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ సూచించారు. సిజేరియన్ల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ గైనకాలజిస్ట్టులు, వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు, సూపర్వైజరలతో సమీకృత కలెక్టరేట్లో శుక్రవారం వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాధారణ ప్రసవాల వల్ల కలిగే లాభాలు, సిజేరియన్లతో కలిగే నష్టాలపై ప్రైవే ట్ ప్రముఖ గైనకాలజిస్టులు చిన్న వీడియోలు రూపొందించాలని, వాటిని వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
జిల్లాలో సిజేరియన్లు తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రైవేట్ వైద్యశాలల్లో సిజేరియన్లు అధికంగా జరుగుతున్నాయని, వాటిని తగ్గించాలని సూచించారు. సాధారణ ప్రసవాల సం ఖ్య పెంచేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు, వైద్యశాఖ అధికారులు సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మొదటి కాన్పు సాధారణ ప్రసవానికి ప్రాధన్యమివ్వాలని, అత్యవసరమైతేనే సిజేరియన్ చేయాలన్నారు. జిల్లాలో సిజేరియన్లు తగ్గించేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు వెళ్లాలన్నారు. మొదటి కా న్పు గర్భిణులకు సాధారణ ప్రసవం జరిగేలా చేయాల్సిన వ్యాయామాలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ వో డా కే ప్రమోద్కుమార్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్, డి ప్యూటీ డెమో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పెద్దపల్లి టౌన్, ఫిబ్రవరి 9: ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను త్వరగా ధ్రువీకరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. పెద్దపల్లి మున్సిపాలిటీ 13వ వార్డులో ప్రజాపాలన దరఖాస్తుల సవరణ కార్యక్రమాన్ని పరిశీంచారు. ప్రభు త్వం రూ. ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అర్హులకు ఇచ్చేందుకు సిద్ధమైందన్నారు. క్షేత్రస్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి తప్పనిసరిగా వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ తోట వెంకటేశ్, కౌన్సిలర్ సోని-శ్రీకాంత్ ఉన్నారు.
కేవీపీఎస్ సామాజికోద్యమ ప్రస్థానం డైరీని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ విడుదల చేశారు. నాయకులు కేవీపీఎస్ నాయకులు కల్లెపల్లి అశోక్, శ్రావన్, ప్రశాంత్, పాల్గొన్నారు.
పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 9: గౌరెడ్డిపేట, ముత్తారం గ్రామాల్లో జడ్పీ సీఈవో శ్రీనివాస్, ఎంపీడీవో ఎం.రాజు, ఎంపీవో సుదర్శన్ శుక్రవారం పర్యటించారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన వివరాలు సేకరించాలన్నారు. వారి వెంట పలువురు అధికారులు, సిబ్బంది ఉన్నారు.