చొప్పదండి, ఫిబ్రవరి 8: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన బోడపట్ల ఓదెలుకు సీఎంఆర్ఎఫ్ కింద రూ. లక్షా 25 వేల ఆర్థిక సాయం మంజూరైంది. కాగా, గంగాధర మండలం బూర్గుపల్లిలోని ఆయన నివాసంలో మంగళవారం ఎమ్మెల్యే లబ్ధిదారుకు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ తొట్ల గంగమల్లయ్య, వీడీసీ చైర్మన్ తొట్ల తిరుపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బందారపు అజయ్కుమార్గౌడ్, అశోక్, అంజయ్య పాల్గొన్నారు.
కులవృత్తుల అభ్యున్నతికి సర్కార్ కృషి
గంగాధర, ఫిబ్రవరి 8: రాష్ట్రంలో కులవృత్తుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని బూరుగుపల్లిలో పద్మశాలీ సంఘ భవన నిర్మాణ పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులను అప్పటి పాలకులు పట్టించుకోలేదని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి సీఎం కేసీఆర్ ఆర్థికంగా చేయూతనందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్రావు, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, సింగిల్ విండో చైర్మన్ దూలం బాలగౌడ్, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, నాయకులు దూలం శంకర్గౌడ్, అట్ల శేఖర్రెడ్డి, తడిగొప్పుల రమేశ్, పద్మశాలీ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు వినతి
గంగాధర, ఫిబ్రవరి 8: బూరుగుపల్లిలోని నివాసంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను తాడిజెర్రి ఎంపీటీసీ ద్యావ మధుసూదన్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రంగరావుపల్లి, తాడిజెర్రి గ్రామాల పరిధిలో రైల్వేలైన్ కింద భూములు కోల్పోతున్న రైతులకు మెరుగైన నష్టపరిహారం వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని వినతిప్రతం సమర్పించారు. నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు. కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య ఉన్నారు.