సింగరేణి అంటే తెలంగాణకు అన్నం పెట్టిన తల్లి అని, మన కొంగుబంగారమని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించారు. సంస్థను కాపాడుకోవడంతోపాటు మరింత విస్తరించుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేదిలేదని స్పష్టం చేశారు. కార్మికుల శ్రేయస్సు, సింగరేణి బతుకుదెరువును మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన రామగుండం నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరయ్యారు.
ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం, సింగరేణిని కాంగ్రెస్ ముంచిన తీరు.. స్వరాష్ట్రంలో సాధించిన విజయాలు, సింగరేణి సంస్థను ఆదుకున్న తీరును వివరించారు. ఉద్యమ సమయంలోనే ఈ ప్రాంత సమస్యలన్నింటినీ గుర్తించామని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకున్నామని చెప్పారు. 600 కోట్ల మారటోరియంలో ఉండి మునగడానికి సిద్ధంగా ఉన్న సింగరేణిని కాపాడుకున్నామని, 2,200 కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఇతర మైనింగ్స్ అన్నీ సింగరేణికి అప్పగిస్తామని, కార్మికులు ఇచ్చే పెర్క్స్ టాక్స్ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
కరీంనగర్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణకు అన్నం పెట్టిన తల్లి సింగరేణిని స్వరాష్ట్రంలో కాపాడుకున్నామని, నష్టాల్లోంచి లాభాల పట్టించామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా కార్మికుల సంక్షేమం కోసం, వారి హక్కులను కాపాడే విధంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోరుకంటి చందర్ను గెలిపిస్తే రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన రామగుండం నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం, సింగరేణిని కాంగ్రెస్ ముంచిన తీరు.. స్వరాష్ట్రంలో సాధించిన విజయాలు, సింగరేణిని ఆదుకున్న తీరును వివరించారు.
ఉద్యమ సమయంలో ఈ ప్రాంతంలో తిరిగానని, సింగరేణి కార్మికుల సమస్యలను వినడంతోపాటు కండ్లారా చూశానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే టీబీజీకేఎస్ నాయకులతో మాట్లాడి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకున్నామని చెప్పారు. 600 కోట్ల మారటోరియంలో ఉండి మునగడానికి సిద్ధంగా ఉన్న సింగరేణిని కాపాడుకున్నామని, 2,200 కోట్ల లాభాల్లోకి తీసుకెళ్లామని గుర్తు చేశారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే కార్మికులకు 25 లక్షలు ఇస్తున్నామని, ఇల్లు కట్టుకునే ప్రతి కార్మికుడికీ 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నామని, రామగుండంలోనే మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశామని, ఇక్కడి దవాఖానల్లో నాణ్యమైన వైద్య సదుపాయాలు అందిస్తున్నామని చెప్పారు.
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కార్మికులకు 32 శాతం లాభాల వాటా ఇచ్చామని, దసరా, దీపావళి బోనస్గా వెయ్యి కోట్లు అందించామని, ఒక్కో కార్మికుడికి రూ. లక్షా యాభై వేల నుంచి రూ.లక్షా ఎనభై వేల వరకు వచ్చాయ ని వివరించారు. ఈ మధ్యనే చందర్ తన దృష్టికి తెచ్చారని, కార్మికులు ఇచ్చే పెర్క్స్ ఏమైతే ఉన్నాయో వాటికి టాక్స్ లే కుండా చేయాలని కోరారని, ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద శాతం అమలు చేయిస్తానని హామీ ఇచ్చారు. కా ర్మికుల హక్కులను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని, ఇంకా ఏమైనా చేయాల్సిన పనులు మిగిలి ఉంటే వాటిని తప్పకుండా చేసుకుందామన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకున్నామని, చందర్ ప్రత్యేక కృషితో రా యదండి, పెద్దంపేట గ్రామస్తులకు కురూజ్ కమ్మీలోని 1018 ఎకరాల భూమి హక్కు పత్రాలను అందించామని చెప్పారు.
ఇలా అన్ని వర్గాలను కలుపుకుని, కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా ఒక మంచి ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని ముందుకు తీసుకుపోతున్నదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో బాధలు పడ్డామని, గోదావరి ఒర్సుకుంట పారే రామగుండం, మంచిర్యాలలో కూడా మంచి నీళ్లకు, కరెంట్కు గోస పడ్డామని, ఇవాళ ఆ బాధలను దూరం చేసుకున్నామన్నారు. మీరు కూడా మంచి పద్ధతిలో ఆలోచన చేసి ఓటు వేస్తే మరింత మంచి జరుగుతుందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కంపెనీ బ్రహ్మాండంగా బతికి ఉన్నది. ఇంకా కొత్త గనులు కూడా వస్తయి. మీకో శుభవార్త చెబుతున్న. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రాలేదు. అప్పుడు సింగరేణిలో మంచి నైపుణ్యమున్న కార్మికులు ఉన్నారని, వాళ్లకు దీనిని అప్పగిస్తానని తేల్చి చెప్పినం. అయినా వినలేదు. సింగరేణి కార్మికులు ఇతర గనుల్లో కూడా ఎందుకు పని చేయకూడదనే ఉద్దేశ్యంతో సింగరేణి ఎండీని ఆస్ట్రేలియాలో గనుల పరిస్థితిని చూసి రమ్మని గతంలో పంపించిన. అయితే, అదే సమయంలో అంతర్జాతీయంగా బొగ్గు ధరలు పడిపోవడంతో దానిని ఆపి పెట్టినం. సందర్భం వస్తే అక్కడి పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకుంటం.
– ముఖ్యమంత్రి కేసీఆర్
నిజాం కాలంలో 134 ఏండ్ల కింద పుట్టిన మన సొంత కంపెనీ సింగరేణి. ఇది మన సొంత ఆస్తి. కాంగ్రెస్ పార్టీ దద్దమ్మ నాయకులకు చేతగాక సమైక్య నాయకుల చేతిలో పెడితే కేంద్రం వద్ద అడ్డగోలు అప్పులు తెచ్చిన్రు. తీర్చే చేతగాక కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా రాసిచ్చింది కాంగ్రెస్సే. మన సింగరేణి నూరు శాతం మనకే ఉండేది. అట్ల లేకుంట చేసింది. డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొట్టింది కూడా ఆ పార్టే. ఆ సమయంలో ఐటక్, ఇన్టక్ అనే సంస్థలు సంతకాలు పెట్టించి ఉన్న హక్కులను లాక్కుని సింగరేణి కార్మికులను బానిసలను చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత టీబీజీకేఎస్ నాయకులు రాజిరెడ్డి, మల్లయ్య చెప్పడంతో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించుకున్నం. 15 వేల మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చుకున్నం.
– ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్. నేటి కలియుగంలో తెలంగాణకు ధర్మస్థాపన కోసం జన్మించిన కారణజన్ముడు ఆయన. నాటి సింహగర్జనలో ఇదే వేదికపై సింగరేణి కార్మికులకు కంటికి చిన్న గాయమైనా నేనున్నానని, సింగరేణిని కాపాడుకుందామని అన్నడు. నేడు కార్మికులకు అండగా ఉన్నడు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను సాధించిండు. జాతీయ పార్టీల కార్మిక సంఘాలు కార్మికుల వారసత్వ ఉద్యోగాలను పోగొడితే.. తిరిగి కేసీఆర్ సాధించిండు. నేడు సింగరేణిలో 22 వేల మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చిండు. రామగుండం ప్రాంత ప్రజల కోసం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరిని నిండుకుండలా మార్చిండు. అంతర్గాం మండలంలో దాదాపు ఆరు దశాబ్ధాలుగా పెండింగ్లో ఉన్న పెద్దంపేట, రాయదండి గ్రామ రైతులకు కురూజ్ కమ్మీ భూములకు 1018 ఎకరాలకు పట్టాలు ఇప్పించిండు. అలాగే, ఐటీ పార్కు, ఇండస్ట్రీయల్ పార్కు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల సముదాయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేసిండు. గోదావరి కాలుష్యం కాకుండా 200 కోట్లతో ఎస్టీపీ నిర్మాణం చేస్తున్నం. పనులు పూర్తవుతున్నయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేసి మనమందరం అండగా నిలబడుదాం. కేసీఆర్ రుణం తీర్చుకుందాం.
– కోరుకంటి చందర్, రామగుండం బీఆర్ఎస్ అభ్యర్థ