జగిత్యాల, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కోసమే పుట్టి, తెలంగాణ సంక్షేమఅభివృద్ధే లక్ష్యంగా ము ందుకు సాగుతున్న బీఆర్ఎస్కు మద్దతునివ్వాలని, చొప్పదం డి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ను గెలిపించాలని ఆ పా ర్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశా రు. రాష్ట్రంలో మూడోసారి ఎన్నికలు జరుగనున్న తరుణంలో ప్రజలు ఆగం కాకుండా, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. గంగాధర మండలం పత్తికుంటపల్లెలో శుక్రవారం చొప్పదండి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభను బీఆర్ఎస్ చొప్పదండి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పాలన లో ఐదు దశాబ్దాల పాటు ఎంతగా ఏడ్చామో.. కష్టపడ్డామో.. తండ్లాడామో.. అందరూ యాది చేసుకోవాలని సూచించారు. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు సాగు, తాగునీటికి ఎంత గోసపడ్డారో అందరికీ తెలిసిందేన్నారు. రామడుగు మండలం రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన రైతు తిరుపతి సాగునీటి కోసం బోర్లు వేసి వేసి, నీరు పడక, ఆ బోర్ల వద్దనే జీవిడిసిన విషయం ఇంకా సజీవంగా కండ్లముందు కదలాడుతూనే ఉం దన్నారు.
200 పెన్షన్ ఇచ్చి ఎంత గోసపెట్టుకున్నారో.. అం దరికీ ఇంకా యాదికే ఉందన్నారు. అలాంటి కాంగ్రెస్ చేసిన నాశనం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి, రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ పదేండ్ల కాలంలో తొవ్వ చేసుకున్నామన్నారు. ఎన్నికల తరుణంలో చొప్పదండి నియోజకవర్గ ప్రజలు తమ కు ఏ పార్టీ మంచి చేస్తుంది? ఏ పార్టీ మంచి చేసింది..? అన్న విషయంపై ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ డేం జర్ మాటలు మాట్లాడుతూ, అధికారం కోసం ప్రజల వద్దకు వస్తున్నదని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మూడు గంటల కరెంట్ రైతులకు సరిపోతుందని, 10 హెచ్పీ మోటర్లు పెట్టుకుంటే చాలని, ధరణిని బంగాళఖాతంలో కలిపి వేయాలంటున్నారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్ ప్రజలు కట్టే అమూల్యమైన పన్నులను రైతుబంధు పేరిట రైతులకు ఇస్తూ దుబారా చేస్తున్నాడని విమర్శిస్తున్నారన్నారు. రైతుబంధు ఉండాలా వద్దా..? 24 గంటల కరెంట్ కావాలా వద్దా..? ధరణి పోర్టల్ ఉండాలా వ ద్దా..? ప్రజలు చెప్పాలన్నారు.
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ను, చొప్పదండిలో సుంకె రవి శంకర్ను గెలిపిస్తే, రైతుబంధు ఉండడమే కాదు, రైతుబంధు రూ.16వేలకు చేరుతుందన్నా రు. 24 గంటల పాటు నిరంతర కరెంట్ ఇస్తామన్నారు. పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ 55 ఏండ్ల దరిద్రం వస్తుందన్నారు. కాంగ్రెస్ తన పాలన కాలంలో కనీసం మంచినీళ్లను సైతం ఇవ్వలేకపోయిందన్నారు. కానీ, తెలంగాణలో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నామన్నారు. రానున్న రో జుల్లో 24 గంటల పాటు మంచినీటిని సరఫరా చేసే విషయా న్ని ఆలోచిస్తున్నామన్నారు. వరద కాలువలకు ఒకప్పుడు తూ ములు సైతం పెట్టనివ్వలేదని, ఇప్పుడు వరద కాలువ పొడవునా అనేక తూములు పెట్టి చెరువులను నింపుకుంటున్నామన్నారు.
చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలోనూ 100 పడక ల దవాఖాన కావాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారని, మంజూరు చేశామన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో గో పాల్రావుపేట, గర్శకుర్తి ప్రాంతాలను మండలాలుగా చేయాలన్న డిమాండ్ ఉందని, అది పెద్ద విషయం కాదని, అధికారంలోకి రాగానే ఆ రెండు ప్రాంతాలను మండలాలుగా ప్రకటిస్తామన్నారు. ప్రజలు మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పుట్టి, ఎదిగిన బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని, చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ను గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, వీర్ల వెంకటేశ్వర్రావు ఉన్నారు.
నా జీవితం ప్రజలకే అంకితం. నా ఊపిరి ఉన్నంత వరకు నియోజకవర్గ ప్రజల కోసమే బతుకుతా. వారి వెంటే ఉంటా. ఆపదొస్తే ఆదుకుంటా. నేను ఈ ప్రాంత బిడ్డను. గతంలో పనిచేసిన వారు స్థానికేతరులు కావడంతో నియోజకవర్గం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు. నేను మీకు దగ్గరలోనే గంగాధర మండలం బూ ర్గుపల్లిలో నివాసం ఉంటూ ప్రజాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నా. దేశాన్ని, రాష్ర్టాన్ని ఏండ్లకొద్ది పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీలేదు. అవినీతి తప్ప వారికి తెలిసిందేమీ లేదు. వారిని నమ్మి తే మోసపోతం. సాగుకు 24గంటల కరెంటు ఇవ్వడం లేదని కాం గ్రెస్, బీజేపీ నాయకులు అసత్యప్రచారం చేస్తున్నరు. వారికి నేనొక్కటే సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే గ్రామాల్లోకి వెళ్లి కరెంట్ తీగలు పట్టుకోవాలి. అప్పుడే కదా ఇస్తున్నామో.. లేదో తెలిసేది.
మరీ ఇ న్ని అబద్ధాలు పనికిరావు. జనం నమ్మరనే విషయాన్ని వారు తెలుసుకోవాలి. చొప్పదండి నియోజకవర్గం ఒకప్పుడు ఎట్ల ఉండె..? ఇప్పుడెట్ల మారింది. వరద కాలువలో నీళ్లు లేక ఎండి పోయి ఉం డేది. కానీ ఈ రోజు కాళేశ్వర జలాలతో జీవనదిలా మారింది. వా టర్హబ్గా మారింది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో అన్ని వర్గాలను అభివృద్ధి చేసుకున్నాం. రాబోయే రోజుల్లో రా ష్ర్టాన్ని మరింత గొప్పగా తయారు చేసుకుంటాం. బీఆర్ఎస్ మ్యా నిఫెస్టో అన్నివర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. కాంగ్రెస్ కు ఓటేస్తే రైతుబంధు, కరెంటు రెండూ బందవుతాయి. రాబోయే ఎన్నికల్లో మళ్లీ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నా విజ్ఞప్తి. రెండోసారి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి, ఈ రోజు ఆశీర్వాదసభకు వచ్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– ప్రజా ఆశీర్వాద సభలో చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్